పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఇమ్రాన్తోపాటు క్షతగాత్రుల్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, వజీరాబాద్లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం […]
బ్రిటన్ లో దొంగిలించబడిన బెంట్లీ సెడాన్ పాకిస్తాన్లో సింధ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకుంది. ఇది అవమానకరమని పాకిస్తాన్ నెట్ జెన్స్ తెగ ఫీలవుతున్నారు. అసలు బ్రిటన్ లో దొంగిలించిన కారును ఎలా పాక్ కు రవాణా చేస్తారని ఆశ్చర్యపోతున్నారు. ఇది అంతర్జాతీయంగా పాక్ పరువుతును తీసినట్లుగా ఆగ్రహిస్తున్నారు. బ్రిటన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బెంట్లీ ముల్సాన్ కారును కరాచీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ శనివారం స్వాధీనం చేసుకుంది. ట్రాకింగ్ పరికరాన్ని ఉపయోగించి బెంట్లీ కారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన […]
భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ రెండో రౌండ్ గేమ్ కి ఇరు జట్లు సిద్ధం. ఇది సూపర్ 4 కాబట్టి ఉత్కంఠ వేరే లెవెల్ లో ఉంటుంది. వారం క్రితం జరిగిన మ్యాచ్ ఇండియా-పాక్ మ్యాచ్ అంటే మజా ఏంటో చూపించింది. ఇంకో సంగతి 2018 ఆసియా కప్ తర్వాత ఈ రెండు జట్లు ఇంత త్వరగా తలపడడం ఇదే తొలిసారి. ఈ గేమ్ సూపర్ 4 దశలో రెండు జట్లకు ఫస్ట్ గేమ్. నిజానికి ఆసియా కప్ […]
దేశ ఆర్ధిక వ్యవస్థ కుదురుకోవాలంటే మీరు టీ తక్కువ తాగాలి. గంటకో కప్పు చొప్పున తాగితే దేశం దివాళాతీయడం ఖాయం. దిగుమతులు పెరుగుతాయి. ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు కరిగిపోతాయి. ప్లీజ్ అంటూ ప్రజలను పాక్ ప్రభుత్వం వేడుకొంటోంది. టీని ఎక్కువగా దిగుమతి చేసుకొనే దేశాల్లో పాక్ ఒకటి. మీరు ఒకటి లేదంటే రెండు కప్పుల టీతో సరిపెట్టుకొంటే, ఆర్ధిక కష్టాల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని పాక్ ప్లానింగ్ అండ్ డవలప్మెంట్ మంత్రి అహసాన్ ఇక్బాల్ […]
ప్రస్తుతం పాకిస్థాన్లో తీవ్ర సంక్షోభం నెకొంది. అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక ఇంధన ధరలు అయితే మండిపోతున్నాయి. రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటరు పెట్రోల్ ధర రూ.209 కాగా డీజిల్ ధర రూ.204 ఉంది. ఇలా పెట్రోల్ రేట్లు పెరగడంతో పాకిస్థాన్ పౌర విమానయాన శాఖకు చెందిన ఓ అధికారి తన బాస్కు రాసిన ఓ లెటర్ వైరల్ గా మారింది. 25 ఏళ్లుగా విమానయానశాఖలో […]
ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరెందుకు సిద్ధం అవుతున్న పాక్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం పది మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో సిరీస్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం ముగ్గురు పాక్ ఆటగాళ్ళు హైదర్ అలీతో పాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్లకు కరోనా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఏడుగురికి కరోనా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, […]
పాకిస్తాన్ క్రికెట్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని షాహిద్ ఆఫ్రిదినే ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం నుంచి తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన శరీరంలో నొప్పులు మొదలయ్యాయని, కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తూ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. కాగా పాకిస్థాన్ లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలో షాహిద్ ఆఫ్రిది ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. పేదలకు […]
తాలిబాన్లతో అమెరికా జరుపుతున్న చర్చల ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామి కావాలని అగ్రరాజ్యం కోరుకుంటున్న వేళ తాలిబాన్ కీలక ప్రకటన చేసింది.తాలిబన్ రాజకీయ విభాగంగా పనిచేసే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మీడియా అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కాశ్మీర్ ఎప్పటికీ భారత్దేనని ప్రకటించాడు.ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది.అలాగే కాశ్మీర్లో జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరిట దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి […]
కరోనా కోరలలో చిక్కుకొని ప్రపంచమంతా విలవిలలాడుతున్న వేళ మరో నాలుగు రోజులలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సాధారణంగా ఈ మాసంలో ముస్లింలు మసీదులలో రోజుకు 5 సార్లు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.రంజాన్ మాసంలో నెల రోజులు పాటు ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సామూహికంగా ప్రార్ధనలు నిర్వహిస్తారు.నెల రోజులూ ఇఫ్తార్ విందులు జరుగుతాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ మాసంలో […]