వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు ప్రసంగాల్లో విమర్శలు, విసుర్లు వినిస్తున్నాయి. బాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడులను కలిపి దుష్టచతుష్టయంగా అభివర్ణించిన మాజీ మంత్రి పేర్ని నాని, వారంతా కలసి, మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చలో మాట్లాడారు. దుష్టచతుష్టయంలో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు. ఈ నలుగురిది […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంట నగరాలు అంటే హైదరాబాద్ – సికింద్రాబాద్ మాత్రమే జ్ఞప్తికి వచ్చేవి. అభివృద్ధి పరంగా రెండు నగరాలు కలిసిపోవడంతో హైదరాబాద్ కు విశ్వ నగరంగా పేరుగాంచింది. విడిపోయి, ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని చంద్రబాబు మరింత లూటీ చేయడంతో దివాళా దుస్థితి దాపురించింది. ఖజానాలో కేవలం రూ.100 కోట్లను మాత్రమే ఉంచింది గత టీడీపీ ప్రభుత్వం. ఇలాంటి సమయంలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వడివడిగా అడుగులు […]
గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక పెళ్లి వల్ల ఇప్పుడు తెనాలి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చివరికి ఈ వివాహానికి హాజరైన బందు మిత్రులు 70 మందిని ఒకేసారి క్వారైంటన్ కు తరలించాల్సివచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం గాంధీనగర్ కు చెందిన దంపతులిరువురు తెనాలి లో జరిగిన వివాహానికి హాజరైన అనంతరం వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తో బుధవారం వారిని విజయవాడ లోని కరోనా ఐసొలేషన్ వార్డు కు తరలించడంతో ఈ దంపతులు […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 6యూ మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1717 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా 589 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1094 గా నమోదయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34 మంది మరణించారు. […]
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో తొలుత ఒక కేసుతో ప్రారంభమై కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం వంద దాటడం అందోళన కలిగిస్తుంది. తొలుత కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని ప్రారంభంలోనే గుర్తించేటప్పటికే ఆతని ద్వారా వైరస్ చాలా వేగంగా పలువురికి విస్తరించింది. కారణం ఆ పాజిటివ్ గా వచ్చిన వ్యక్తి లోకల్ కేబుల్ నెట్వర్క్ లో కలెక్షన్ ఎజంట్ గా అనేక మంది తో కలవడమే. సదరు వ్యక్తి కి కరొనాపాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే […]
గుంటూరు ఐటీసీ కంపెనీ ఎదురు హోటల్ సుభానీ యజమాని సుభానీ నిన్న సాయంత్రం అనారోగ్యంతో చనిపోయారు . గత ఐదు రోజుల నుండి జ్వరం , లివర్ ప్రాబ్లెమ్తో బాధపడుతున్న ఆయన ఏ కారణం చేతనో వైద్య సహాయం తీసుకోకుండా ఇంటి వద్దే ఉన్నారని 24 వ తారీఖు హాస్పిటల్ లో చేరగా నిన్న 25 న సాయంత్రం ఐదు గంటలకు చనిపోయారని తెలుస్తుంది . బిర్యానీ , నాన్ వెజ్ ప్రియులు రాష్ట్రంలో ఏ మూలనున్న […]
ఏపీలోని గుంటూరు నగరంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న మహిళా డాక్టర్కి కరోనా సోకింది. దీంతో ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న 12 మంది డాక్టర్లను అధికారులు క్వారంటైన్కు తరలించారు. కాగా గుంటూరులో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా.. వారికి వైద్యం అందిస్తోన్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురి రిపోర్ట్ రాగా, […]
గుంటూరులోని ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్లో పని చేస్తున్న 12 మంది వైద్యులను గురువారం క్వారంటైన్కు పంపడం జిల్లాలో సంచలనంగా మారింది.కరోనా బాధితులకు వైద్య చికిత్స అందజేసే సమయంలో వారితో సన్నిహితంగా మెలగటంతో స్వీయ దిగ్బంధంలో ఉంచారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్ఎంపీ వైద్యులకు కరోనా సోకినట్టుగా అధికారులు తెలిపారు.మెడికోకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక ప్రైవేటు హోటల్ను క్వారంటైన్ కేంద్రంగా మార్చి ఇద్దరు బోధనానిపుణులు, పదిమంది […]
కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోంది.. ఇప్పటికే 473 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. వీరిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా కర్నూలు గుంటూరు జిల్లాల్లో ప్రమాదకరంగా విస్తరిస్తుండడంతో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా అనంతపురం మడకశిర నియోజకవర్గంలో ఒక తహసీల్దార్ కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి.. గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో పాటూ నర్సరావుపేటలో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు.. లాక్డౌన్ మరింత కఠినంగా గా అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా […]