ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించడంపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్ లో ఉన్న అంశాల వారీగా రమేష్ కుమార్ తన వివరణ ఇచ్చారు. ఎన్నికల సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల […]
కేంద్ర హోం శాఖకు తాను ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ చెప్పారు. ఏఎన్ఐ వార్తా చానెల్కు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఆ లేఖ తాను రాయలేదని తెలిపారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ నిన్న బుధవారం రమేష్కుమార్ లేఖ రాశారంటూ ప్రచారం జరిగింది. ఓ లేఖ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రచారమయ్యాయి. వార్త ఛానెళ్లలో చర్చలు జరిగాయి. […]
ఎన్నికలు వాయిదా అంశం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోనిదంటూ సుప్రిం కోర్టు తీర్పునివ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా బ్రేక్ పడింది. కరోనా ప్రభావం కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై సుప్రింలో సానుకూల తీర్పు వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. అయితే ఎన్నికల కోడ్ ఎత్తివేయడం ఊరటనిచ్చింది. మేలో మళ్లీ ప్రారంభం.. ఆరు వారాలు అంటే.. ఏప్రిల్ నెలాఖరు వరకూ స్థానిక సంస్థల […]
ఈ నెలాఖరులోపే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ సర్కార్ ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. కరోనాను కారణంగా చూపుతూ ఏపీలో స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వాయిదా వేయగా.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రింలో నిన్న సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా సుప్రింలో ఈ రోజు మంగళవారం […]
కరోనా వైరస్ను కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపుతట్టింది. లంచ్మోషన్ రూపంలో పిటిషన్దాఖలు చేసింది. పిటిషన్ను హైకోర్టు విచారించింది. అయితే ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఊరట కలిగించే నిర్ణయం రాలేదు. పైగా నిరుత్సాహం వచ్చేలా విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు విచారణ, నిర్ణయం ఆశగా ఎదురుచూసిన […]
ఆంధప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, పత్రిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారగా.. తాజాగా ఎన్నికల వాయిదా అంశం సవాళ్లకు దారితీస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి సవాళ్లు వస్తుంటాయి. కానీ చిత్రంగా ఏపీలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి సవాళ్లు వెళుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని, పోలీసులను ఉపయోగిస్తూ తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అందుకే భారీ సంఖ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు […]
ఆడలేక మద్దెల ఓడ అన్న చందంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీల తీరు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అలా ప్రకటించారో లేదో.. అందరూ కూడబలుక్కుని మాట్లాడినట్లుగా ఎన్నికలను మళ్లీ మొదట్నుంచి జరపాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నుంచి మొదలుకుని జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ సారధి కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రామకృష్ణ, చివరకు కాంగ్రెస్ నూతన సారధి సాకే శైలజానాథ్ వరకూ […]
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో అడ్రస్ లేకుండా పోయిన జనసేన , బిజేపి పార్టీలు ఎన్నికల తరువాత రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా మారాలనే ఆలోచనతో సిద్దాంతాలను సైతం పక్కకు నెట్టి రాజకీయ అవసరాలకోసం ఒకరికొకరు చేతులు కలిపి పొత్తులు ఏర్పర్చుకున్నారు. గడిచిన ఎన్నికల్లో దెబ్బతిన్నా వచ్చే స్థానిక ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్ళి తమ సత్తా చాటుతాం అని ఆనాడే ఇరు పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశారు. జాతీయ పార్టీ అండతో , పవన్ కళ్యాణ్ క్రేజ్ […]
2019 సాధారణ ఎన్నికల సందర్భంగా అధికారం అండగా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. చాలా గ్రామాల్లో సిట్టింగ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అడుగు కూడా పెట్టనివ్వకుండా గొడవలు సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి పులివర్తినాని దౌర్జన్యాలు చేశారు. దీంతో ఆ నియోజకవర్గం అత్యంత వివాదాస్పదం అయ్యింది. కొన్ని గ్రామాల్లో రీపోలింగ్ కూడా జరిగింది. అన్నింటినీ తట్టుకొని చెవిరెడ్డి భాస్కరరెడ్డి 40వేలకు పైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో […]
స్థానిక సంస్థల ఎన్నికల వేళ చిత్తూరు జిల్లా జనసేన నాయకులు కిడ్నాప్ డ్రామాకి తెరలేపారు. వై.యస్.ఆర్.సి.పి నాయకులపై ఆరోపణలే టార్గెట్ గా పథకం రచించిన జనసేన నాయకులు పోలీసులు రంగంలోకి దిగడంతో అడ్డంగా బుక్కయ్యారు. వివరాలోకి వెళితే రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్ ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ “నగరం వినూత” తన ఇంట్లో దాచిపెట్టి తమ అభ్యర్ధిని వై.సి.పి నాయకులు కిడ్నప్ చేశారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో షాహిద్ కనిపించడంలేదని కుటుంబ […]