iDreamPost
android-app
ios-app

సరికొత్త కథాంశంతో.. సరికొత్తగా ‘పయనం’ చిత్రం ప్రారంభం

  • Published Jun 09, 2025 | 12:20 PM Updated Updated Jun 09, 2025 | 12:20 PM

రోటి కపడా రొమాన్స్‌ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్‌ హీరోగా, 'జనక అయితే గనక' చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్‌ నాయికగా నటిస్తున్న నూతన చిత్రం 'పయనం' ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

రోటి కపడా రొమాన్స్‌ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్‌ హీరోగా, 'జనక అయితే గనక' చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్‌ నాయికగా నటిస్తున్న నూతన చిత్రం 'పయనం' ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

  • Published Jun 09, 2025 | 12:20 PMUpdated Jun 09, 2025 | 12:20 PM
సరికొత్త కథాంశంతో.. సరికొత్తగా ‘పయనం’ చిత్రం ప్రారంభం

రోటి కపడా రొమాన్స్‌ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్‌ హీరోగా, ‘జనక అయితే గనక’ చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్‌ నాయికగా నటిస్తున్న నూతన చిత్రం ‘పయనం’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఛాయచిత్రాలు పతాకంపై చందురామ్‌ దర్శకత్వంలో స్వర్ణ కమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ క్లాప్‌ నివ్వగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్వీచాన్‌ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. డ్రామా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్‌ చేసే అంశాలు చాలా ఉంటాయి. అవసరాల శ్రీనివాస్‌ మా చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. అంతేకాదు ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ”ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న ఓ వైవిధ్యమైన చిత్రమిది. మంచిర్యాల, తమిళనాడు, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. జూలై 7 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అన్నారు. సుప్రజ్‌, సంగీర్తన విపిన్‌, అవసరాల శ్రీనివాస్‌, రఘు కుంచె ఆమని, మైమ్‌ మధు, మెహబూబ్‌ భాషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

రచనా సహకారం, మాటలు, స్కీన్‌ప్లే: వీరా రెడ్డి, సతీష్‌ కుమార్‌ మూల
డీఓపీ: షోయబ్‌
సంగీతం: రఘు కుంచె
ఆర్ట్‌: రాజశేఖర్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రూమ్‌ జైన్‌
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పి.భరత్‌ రెడ్డి
కథ_దర్శకత్వం: చందురామ్‌
నిర్మాత: స్వర్ణ కమల
బ్యానర్‌: ఛాయచిత్రాలు