ఇరాక్ లోని 3,400 సంవత్సరాల పురాతన నగరం తీవ్రమైన కరువు తరువాత నీటి అడుగున నుండి బయటపడింది. తీవ్రమైన కరువు కారణంగా ఒక జలాశయం నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో ఇలా 3,400 సంవత్సరాల పురాతన నగరం దర్శనమిచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉత్తర ఇరాక్ లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని టైగ్రిస్ నది వెంబడి మోసుల్ జలాశయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్ని పరిశోధించేందుకు కుర్దిష్ మరియు జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు నడుం బిగించారు. ఈ ప్రాంతాన్ని క్రీ.పూ 1550 నుండి 1350 వరకు పాలించిన మిట్టాని సామ్రాజ్యం లోని ప్రధాన కేంద్రమైన […]
1990లో, గల్ఫ్ యుద్ధ సమయంలో, సద్దాం హుస్సేన్ కువైట్ పై దండెత్తినప్పుడు, ఇరాకీలు కొన్ని గంటల్లో నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఈ యుద్దంలో చిక్కుకున్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం చరిత్రలోనే నిలిచిపోయే అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ యుద్దంలో చిక్కుకున్న 1,70,000 మంది భారతీయులను కేవలం 59 రోజుల్లో 488 విమానాల సహాయంతో కువైట్ నుండి విమానంలో తిరిగి స్వదేశానికి రప్పించింది. ఇప్పటి వరకు మానవజాతి చరిత్రలో ఆకాశ మార్గాన్న అతిపెద్ద తరలింపుగా ఈ ఘటన […]