రాజ్యసభలో పెద్దల ఎంట్రీపై కూడా కరోనా ప్రభావం పడింది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. వచ్చే నెల 4వ తేదీకి రాజ్యసభలో 55 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర […]
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిటింగ్ ఎంపీగా కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. […]
టీఆరెస్ రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఖరారయ్యింది. టీఆరెస్ తరపున సీనియర్ నేత కే.కేశవరావు (కేకే ), మాజీ అసెంబ్లీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి లను రాజ్యసభ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈసారి తెలంగాణ నుండి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ రెండు స్థానాలను టీఆరెస్ సునాయాసంగా కైవసం చేసుకోనుంది. శనివారంతో రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ ముగియనుండటంతో, రాజ్యసభ స్థానాల కోసం అధికార టీఆరెస్ లో గట్టిపోటీ నెలకొని ఉండడంతో ఎట్టకేలకు […]
రాజ్యసభలో ఖాళీ కాబోతున్న మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ దఫా 17 రాష్ట్రాల్లోని 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4 స్థానాలు, తెలంగాణా లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కె.కేశవ రావు, తోటా సీతామాహాలక్మి, ఎం.ఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి స్థానాలు ఖాళీ కానుండగా, తెలంగాణ నుండి కెవిపి రామచందర్ రావు, గరికపాటి రామ్మోహన రావు స్థానాలు ఖాళి కానున్నాయి. […]