ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మహారాష్ట్రకు కరోనా వైరస్ లాంటివారని బిజెపి ఎమ్మెల్సీ గోపిచంద్ పదల్కర్ మండిపడ్డారు. ఆయన చాలా సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నడిపించారని, అయితే బహుజన ప్రజలను మాత్రమే హింసించారని ఆరోపించారు. ఇకపై కూడా బహుజనుల విషయంలో ఆయన వ్యవహార శైలి ఇలాగే కొనసాగుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ధంగర్’ సమాజానికి రిజర్వేషన్లు ఇచ్చే వ్యవహరంలో కూడా ఆయన రాజకీయంగా చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ధంగర్ […]
రాజ్యసభలో ఖాళీ అయిన 55 స్థానాల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 37 స్థానాలు ఏకగ్రీవం కాగా 18 స్థానాల్లో పోటీ అనివార్యమైంది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. 37 స్థానాల్లో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో అవన్నీ ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ తదితరులు […]