మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో విచారణ కీలక దశలో ఉన్నందున.. ఆ విచారణ పూర్తయి, తుది తీర్పు వచ్చే వరకూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి బదిలీని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య రాసిన లేఖ ఎన్నో ప్రశ్నలకు, ఆరోపణలకు సమాధానాన్ని ఇస్తోంది. ఇదే సమయంలో సరికొత్త ప్రశ్నలకు, సందేహాలకు […]
ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జిత్రేంద్ర కుమార్ మహేశ్వరి బదిలీ అవ్వబోతున్నారనే ప్రచారం మీడియా లో జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో వరుసగా ఏపీ హైకోర్టు వెలువరిస్తున్న తీర్పులు , రొటేషన్ వ్యవహారాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో సీజే బదిలీ అవ్వబోతున్నారనే ప్రచారం చర్చనీయాంశం అవుతోంది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి ని నియమిస్తారని కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. […]