దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటి మద్రాస్ నిలిచింది. దేశంలోని విద్యా సంస్థలకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)-2020 ర్యాంకులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) విడుదల చేసింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంహెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, సహాయ మంత్రి సంజరు ధోత్రే పది విభాగాలకు ర్యాంకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఆర్డీ ఉన్నత విద్యా అడిషనల్ సెక్రటరీ రాకేష్ రంజన్, యుజిసి చైర్మెన్ ప్రొఫెసర్ […]