రెండు రోజుల మహానాడు తర్వాత జరిగిన పరిణామం చూస్తుంటే అలాగే ఉంది. బుధ, గురువారాల్లో టిడిపి నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ మహానాడు అయిపోగానే శుక్రవారం చంద్రబాబునాయుడు, చినబాబు తిరిగి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. కరోనా వైరస్ దెబ్బకు 65 రోజులుగా హైదరాబాద్ లోని ఇంట్లో లాక్ డౌన్లో ఉండిపోయిన తండ్రి, కొడుకులు అమరావతికి చేరుకున్నదే మహానాడు కోసమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసలు ముందుగా హైదరాబాద్ నుండి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించి అక్కడి నుండి […]
డిజిటల్ మహానాడు రెండో రోజు గురువారం సీనియర్ నేత పిఆర్ మోహన్ పార్టీలోని లోపాలపై దుమ్ము దులిపేశాడు. వెబినార్లో మాట్లాడిన మోహన్ పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నాడు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఎన్టీయార్ పడిన కష్టాన్ని అందరికీ వివరించాడు. పనిలో పనిగా ఒకవైపు ఎన్టీయార్ ను పొగుడుతునే హఠాత్తుగా చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపాడు. చంద్రబాబు చుట్టూ సతీష్ చంద్ర, రాజమౌళి, ప్రద్యుమ్నా, శ్రీనివాస్ ఓ వలయంలాగా ఏర్పడినట్లు ఆరోపించాడు. […]