ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాపై యుద్ధానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. మన దేశంలోనూ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. వీరందరినీ మించి టాటా గ్రూపు అతి పెద్ద మనసుతో భారీ విరాళాన్ని ప్రకటించింది.