కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నీళ్లను పూర్తిస్థాయిలో వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చెప్పింది. సోమవారం హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్తో ఏపీ జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్దేశాలను నిర్మొమహాటంగా తేల్చి చెప్పారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు […]