iDreamPost

యష్ ఫ్యాన్స్​కు అదిరిపోయే అప్​డేట్.. KGF ఛాప్టర్-3పై ఫుల్ క్లారిటీ!

  • Author singhj Published - 03:29 PM, Sat - 30 September 23
  • Author singhj Published - 03:29 PM, Sat - 30 September 23
యష్ ఫ్యాన్స్​కు అదిరిపోయే అప్​డేట్.. KGF ఛాప్టర్-3పై ఫుల్ క్లారిటీ!

హీరోలు, ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. బహు భాషల్లోకి సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేయడం లేదా డైరెక్ట్​గా రెండు, మూడు భాషల్లో మూవీస్ తీయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. సొంత భాషతో పాటు మిగిలిన ఏరియాల్లోనూ మార్కెట్ ఏర్పర్చుకోవాలని హీరోలు ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్​తో సినిమాలు తీస్తూ ఏకకాలంలో దేశమంతటా విడుదల చేస్తున్నారు. ఒకవేళ మూవీ హిట్టయితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పాన్ ఇండియా కాన్సెప్ట్​కు ఇంత హైప్ తీసుకొచ్చింది దర్శకధీరుడు రాజమౌళినే. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్​తో ఇది మొదలైంది.

‘బాహుబలి’తో నార్త్​ మార్కెట్​పై సౌత్ సినిమాల దండయాత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్​’ సిరీస్​తో ఇది నెక్స్ట్ లెవల్​కు చేరుకుంది. రాకీ భాయ్​ను బాలీవుడ్ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. మూడో భాగాన్ని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే దాని నుంచి అప్​డేట్ కోసం యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోసం ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్-3’ గురించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​కు చెందిన అధికార ప్రతినిధి కొత్త అప్​డేట్ చెప్పారు.

మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్-3’ మూవీ 2025లో రిలీజ్ కానుందని హోంబలే ఫిల్మ్ ప్రతినిధి తెలిపారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ ఏడాది మొదలవుతుందని.. ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్​గా ప్రకటిస్తుందట. చిత్రం రెగ్యులర్ షూటింగ్​ను 2024లో ప్రారంభించి.. 2025కల్లా సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారని సమాచారం. ‘కేజీఎఫ్​-2’కు ప్రీక్వెల్​గా ఛాప్టర్-3ని తెరకెక్కిస్తారట. ఇందులో రాకీ భాయ్ అమెరికా సహా 16 దేశాలను తన గుప్పిట్లో ఉంచుకుంటాడని వినికిడి. మరి.. ‘కేజీఎఫ్ 3’ కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై స్పందించిన సెన్సార్ బోర్డు.. ఏమందంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి