iDreamPost
android-app
ios-app

తీవ్ర విషాదంలో డైరెక్టర్ నందినీ రెడ్డి.. ఏమైందంటే..?

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా కెరీర్ స్టార్ట్ చేసింది నందినీ రెడ్డి. అనతి కాలంలోనే టాలెంట్ అండ్ వర్సలైట్ అండ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా కెరీర్ స్టార్ట్ చేసింది నందినీ రెడ్డి. అనతి కాలంలోనే టాలెంట్ అండ్ వర్సలైట్ అండ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

తీవ్ర విషాదంలో డైరెక్టర్ నందినీ రెడ్డి.. ఏమైందంటే..?

తెలుగులో ఉన్న అతి కొద్దీ మంది మహిళా దర్శకుల్లో నందిని రెడ్డి ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ చేసిన నందినీ.. అనతి కాలంలోనే స్టార్ దర్శకురాలిగా మారిపోయింది. అలా మొదలైంది మొదలుకుని.. అన్ని మంచి శకునములే వంటి చిత్రాలను రూపొందించింది. నాని, సమంత వంటి స్టార్ హీరో హీరోయిన్లను లీడ్ చేసింది. అంతే కాకుండా పలు టీవీ షోలకు హోస్టుగా, ప్రొగ్రామ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది నందినీ. తన తదుపరి ప్రాజెక్టుతో సిద్దు జొన్నలగడ్డతో చేయబోతున్నట్లు ప్రకటించింది గతంలో. అయితే ఈ సినిమా పట్టాలెక్కిందో లేదో తెలియదు. కానీ నందినీ ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నందినీ రెడ్డి ఇంట విషాదం నెలకొంది.

నందినీ రెడ్డి.. తన సోదరినీ కోల్పోయింది. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చింది. ‘ మనకు ఇష్టమైన వాళ్లను కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్ళలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే తొలిసారి. నన్ను మొట్టమొదటిసారిగా అక్క అని పిలిచింది శాంతినే. శాంతి నాకు తెలిసినంత వరకు చాలా దయ కలిగిన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు ఆమెకు అత్యంత బలమైన విషయం అని నమ్ముతాను. అదే బలంతో అదే చిరునవ్వుతో గత నాలుగు నెలల నుంచి యుద్ధమే చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ ఆ యుద్దంలో ఓడిపోయింది. ఈ రోజు ఆమె వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఆమె ఒక బెస్ట్ కుమార్తె, ఒక బెస్ట్ సోదరి, ఒక బెస్ట్ వైఫ్ అలాగే ఒక బెస్ట్ తల్లి ఒక బెస్ట్ ఫ్రెండ్.

మరొకపక్క మనం కలిసే వరకు.. నా డార్లింగ్ చెల్లెలా నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం ’ అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా తన సోదరి ఫోటో షేర్ చేసి ఎమెషనల్ పోస్టు చేసింది దర్శకురాలు నందినీ రెడ్డి. అయితే ఆమె ఎలా చనిపోయిందో తెలియరాలేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతూ చనిపోయినట్లు ఆమె ఇన్ స్టా స్టోరీని బట్టి అర్థమౌతుంది. ఇదిలా ఉంటే.. ఆమె మరణ వార్త గురించి తెలిసిన సెలబ్రిటీలు నందినీ సోదరికి మేసేజ్ ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గోపీ మోహన్, యాంకర్ ఝాన్సీ, అశ్విన్ కాకుమాను, ప్రగ్యా జైశ్వాల్ వంటి సెలబ్రిటీలు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు నెటిజన్లు కూడా కండోలెన్స్ తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nandini Reddy (@nandureddyy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి