iDreamPost
android-app
ios-app

చాలా కాలం తర్వాత ఒకే వేదికపై ఆ నలుగురు….

  • Published Jun 14, 2025 | 3:35 PM Updated Updated Jun 14, 2025 | 3:35 PM

వీరి ముందు తరంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ హవా తగ్గిన తర్వాత కొన్నేళ్ల పాటు బాక్స్ ఆఫీస్ బాధ్యత మోసింది ఈ నలుగురే. ఆ తర్వాత కొత్త తరం హీరోలు వచ్చిన తర్వాత వీరు జోరు తగ్గినా.. ఇప్పటికి వీరు సినిమాలు కొనసాగిస్తే వారి ప్రాధాన్యతను చాటుకుంటున్నారు.

వీరి ముందు తరంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ హవా తగ్గిన తర్వాత కొన్నేళ్ల పాటు బాక్స్ ఆఫీస్ బాధ్యత మోసింది ఈ నలుగురే. ఆ తర్వాత కొత్త తరం హీరోలు వచ్చిన తర్వాత వీరు జోరు తగ్గినా.. ఇప్పటికి వీరు సినిమాలు కొనసాగిస్తే వారి ప్రాధాన్యతను చాటుకుంటున్నారు.

  • Published Jun 14, 2025 | 3:35 PMUpdated Jun 14, 2025 | 3:35 PM
చాలా కాలం తర్వాత ఒకే వేదికపై ఆ నలుగురు….

ఇప్పుడంటే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు వస్తూ ఉన్నారు కానీ. ఒక్కప్పుడు అగ్ర కథానాయకుల జాబితాలో కేవలం ఆ నలుగురు పేర్లే వినిపించేవి. వారే మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ , అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్. వీరి ముందు తరంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ హవా తగ్గిన తర్వాత కొన్నేళ్ల పాటు బాక్స్ ఆఫీస్ బాధ్యత మోసింది ఈ నలుగురే. ఆ తర్వాత కొత్త తరం హీరోలు వచ్చిన తర్వాత వీరు జోరు తగ్గినా.. ఇప్పటికి వీరు సినిమాలు కొనసాగిస్తే వారి ప్రాధాన్యతను చాటుకుంటున్నారు.

అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే… ఈ నలుగురు స్టార్స్ ను ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒకే వేదికపైన చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో బాలకృష్ణ ఓ పురస్కారానికి ఎంపికయ్యారు. కాగా చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రానున్నట్లు తెలుస్తుంది.

గత పదేళ్లకు కలిపి ఒకేసారి ఈ అవార్డులను ప్రకటించారు. దీనితో సినీ పరిశ్రమ వారు ఎంతో సంతోషించారు. ఇలాంటి కార్యక్రమాలు పురస్కారాలు వారిని ఇంకా ఉత్సాహపరుస్తుందని చాలా మంది నటి నటులు అభిప్రాయాలూ వ్యక్తం చేశారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఎంత అట్టహాసంగా జరగనుందో చూడాలి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.