ఇంటర్ విద్యార్థినిపై రౌడీషీటర్ దారుణం.. ఆటోలో బలవంతంగా ఎక్కించి

Rowdy-Sheeter Threatened Inter Girl And Took Her To Secret Place: ఏపీలో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న ముచ్చుమర్రి ఘటన మరువకముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. రౌడీషీటర్ ఇంటర్ విద్యార్థినిని బలవంతంగా ఆటో ఎక్కించి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

Rowdy-Sheeter Threatened Inter Girl And Took Her To Secret Place: ఏపీలో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న ముచ్చుమర్రి ఘటన మరువకముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. రౌడీషీటర్ ఇంటర్ విద్యార్థినిని బలవంతంగా ఆటో ఎక్కించి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

ఏపీలో ముచ్చుమర్రి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు దారుణానికి ఒడిగట్టిన ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. పోలీసులు ఇప్పటికీ బాలిక మృతదేహం కోసం వెతుకుతున్నారు. కాగా ఈ ఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆటోలో ఇంటర్ విద్యార్థినిని బలవంతంగా ఎక్కించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడో రౌడీషీటర్. ఈ ఘటన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో చోటు చేసుకుంది. గూడూరులోని అశోక్ నగర్ కి చెందిన గుజ్జపల్లి వినయ్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వెంటపడేవాడు. ప్రేమ పేరుతో విసిగించేవాడు. రెండేళ్ల క్రితం అశోక్ కి పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే మళ్ళీ అమ్మాయి వెంట పడటం మొదలుపెట్టాడు. గురువారం కాలేజీకి వెళ్తున్న ఇంటర్ విద్యార్థినితో మొదట ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత కత్తి తీసి బెదిరించి ఆటో ఎక్కించాడు.

బలవంతంగా ఆ అమ్మాయిని ఆటోలో గాంధీనగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో అత్యాచారం చేశాడు. అయితే అవమానంతో ఆ ఇంటర్ విద్యార్థిని ఫ్లోర్ క్లీన్ చేసే లైజాల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వాంతులు అవ్వడంతో కుటుంబ సభ్యులు ఆమెను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా అమ్మాయి అసలు విషయం బయటపెట్టింది. తనను కత్తితో బెదిరించి ఆటోలో తిప్పుతూ ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఒకసారి వేధించాడని.. అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ మీద రౌడీషీటర్ కేసు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వినయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై పోలీసు వారు మాట్లాడుతూ.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. రెండేళ్ల క్రితం వినయ్ అనే రౌడీషీటర్ అమ్మాయిని బెదిరించినట్లు తెలిసిందని అన్నారు. మానవ మృగంలా అమ్మాయిపై అత్యాచారం చేశాడని.. ఇటువంటి ఘటనలపై సీరియస్ యాక్షన్స్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని అన్నారు. చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తే పోక్సో యాక్ట్ కింద 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే పూర్తిగా రౌడీషీటర్ గా చూస్తామని.. ప్రతి ఆదివారం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు. ప్రతి రౌడీషీటర్ కూడా ఆదివారం ఆదివారం స్టేషన్ కి అటెండ్ అవ్వాలని అన్నారు. రౌడీషీటర్ల మీద నిఘా ఉంచుతామని.. నేరాలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన రౌడీషీటర్ వినయ్ పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు.

Show comments