iDreamPost
android-app
ios-app

Crime: దారుణం! ప్రియుడితో కలిసి భర్తకు కల్లు తాగించి మరీ హత్య చేసిన భార్య!

  • Published Nov 30, 2024 | 4:57 PM Updated Updated Dec 02, 2024 | 3:07 PM

Nagarkarnool: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి తూడుకుర్తిలో దారుణ సంఘటన జారింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ దుర్మార్గురాలు.

Nagarkarnool: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి తూడుకుర్తిలో దారుణ సంఘటన జారింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ దుర్మార్గురాలు.

Crime: దారుణం! ప్రియుడితో కలిసి భర్తకు కల్లు తాగించి మరీ హత్య చేసిన భార్య!

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి తూడుకుర్తిలో ఛీ ఛీ అనిపించే దారుణ సంఘటన జరిగింది. సభ్య సమాజం సిగ్గు పడేలా ఈ ఘటన జరిగింది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. అతన్ని కాలువలో పడేసింది. ఆ హత్యని ఆత్మహత్యగా మార్చే ప్రయత్నం చేసిందీ ఇల్లాలు.. చివరకు పోలీసుల ఎంట్రీతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ (35)బిజినపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. 2011లో గద్వాల్ కు చెందిన కీర్తి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయ్యాడు. తన భార్య కీర్తి కూడా జాబ్ చేస్తుంది. ఆమె SBM అనే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో పనిచేస్తోంది. అక్కడే బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు.. అది కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. ఆ ప్రేమ వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకి తెలిసింది. విషయం తెలిసి తన భార్యను గట్టిగా మందలించాడు.భర్తకు తన బాగోతం తెలిసాక ప్రియుడు దూరమవుతున్నాడని ఫీల్ అయ్యింది. ఏకంగా భర్త అడ్డును తొలగించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. అలా కొన్ని రోజుల క్రితం బిజినపల్లి మండల కేంద్రంలో ప్రియుడితోపాటు మరో వ్యక్తితో కలిసి భర్తపై దాడి చేయించింది. అలా దాడి చేయించినా కూడా ఆ భర్త ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సారి ప్రియుడిని వదిలించుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని భార్యకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కానీ ఆమె బుద్ధి ఏమాత్రం మారలేదు. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఫిక్స్ అయింది. మొత్తానికి దారుణం చేసేసింది. ఇంతకీ ఎలా హత్య చేసిందో తెలుసా?

దైవ దర్శనం పేరుతో గద్వాల్ లోని తన పుట్టింటికి తీసుకెళ్ళింది. అక్కడకి నాగరాజుని కూడా రప్పించింది. ఇద్దరు కలిసి మత్తు మందు కలిపిన కల్లును జగదీష్ తో తాగించారు. ఇక జగదీష్ స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కారులో తూడుకుర్తి గ్రామ శివారులోని బావి వద్దకు తీసుకెళ్లారు. ఫస్ట్ కరెంట్ షాక్ తో చంపాలని భావించారు. అయితే అప్పుడు కరెంట్ లేకపోవడంతో ప్లాన్ మార్చారు. KLI కాల్వలో తోసేశారు.. అంతటితో ఆగకుండా జగదీష్ ను నీళ్లలో ముంచి దారుణంగా చంపారు. ఇక మరునాడు తన భర్త కనిపించడం లేదంటూ ఏమి ఎరుగనట్లు నటించింది భార్య కీర్తి. రెండు రోజుల తర్వాత బిజినపల్లి మండలం ఆల్లిపూర్ గ్రామ శివారులో కాలువలో భర్త జగదీష్ మృతదేహం లభించింది. ఈ విషయంలో మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యని అదుపులో తీసుకొని విచారించగా అసలు గుట్టు రట్టయింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణం అంటూ పోలీసులు తేల్చారు.

మృతుడి భార్య కీర్తి, అత్త, బావమరిది, నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించి.. ఆరుగురిని అరెస్టు చేశారు. మత్తుమందు అందించిన వ్యక్తి మోహన్ గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది..ఇక మరునాడు తన భర్త కనిపించడం లేదంటూ ఏమి ఎరుగనట్లు నటించింది కీర్తి. రెండు రోజుల తర్వాత బిజినపల్లి మండలం ఆల్లిపూర్ గ్రామ శివారులో కాలువలో భర్త జగదీష్ మృతదేహం దొరికింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యని అదుపులో తీసుకొని విచారించగా అసలు గుట్టు రట్టయింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. మృతుడి భార్య కీర్తి, అత్త, బావమరిది, నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించి.. ఆరుగురిని అరెస్టు చేశారు. మత్తుమందు ఇచ్చిన మోహన్ గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది..

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis