ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటు మరింత ఆలస్యం కాబోతోంది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి శాసన పరమైన అన్ని చర్యలను జగన్ సర్కార్ చేపట్టినా.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు, సుప్రింకోర్టులలో దాఖలైన పిటిషన్లను అన్నింటినీ కలిపి రోజు వారీ విచారణ జరపాలని సుప్రిం కోర్టు ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది […]