ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్త నేతృత్వంలో దిశా నిందితులకు గాంధీ ఆసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ భద్రత మధ్య మృత దేహాలను స్వస్థలాలకు తరలింపు ప్రక్రియను పోలీసులు చేపట్టారు. ఇప్పటికే గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.రెండు అంబులెన్సుల ద్వారా మృతదేహాలను తరలిస్తున్నారు. గ్రామాలకు మృతదేహాలు చేరుకున్న వెంటనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. పోస్టుమార్టం సందర్భంగా […]