శాసనమండలిలో మాట్లాడటానికి ఎటువంటి పాయింట్లు లేనపుడే పనికిమాలిన విషయాలపై టిడిపి మాట్లాడుతున్నట్లు, గోల చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే సభలో జరగాల్సిన పనేదో చూడకుండా మంత్రుల గడ్డాలపై టిడిపి సభ్యుడు నాగ జగదీశ్వర్ లేవనెత్తిన అంశమే నిదర్శనం. అనవసరంగా ఓ పనికిమాలిన అంశాన్ని లేవనెత్తి చివరకు మంత్రుల సమాధానంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయ్యింది. అసలేమి జరిగిందంటే మండలిలో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉండగా అన్నింటినీ వదిలిపెట్టి టిడిపి సభ్యుడు జగదీశ్వరరావు మాట్లాడుతూ ’గడ్డాలు పెంచుకుని మంత్రులు […]
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన వాగ్వాదంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ద్రవ్య వినిమయ బిల్లు మొదట ప్రవేశపెట్టాలని టీడీపీ, సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో రోజంతా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ సభ్యుల మధ్య ఉదయం మొదలైన వాదోపవాదాలు సమయం గడిచే కొద్దీ పెరిగాయి. సభ్యులు ఒకరినొకరు దూషించకోవడం, తోసుకోవడం వరకూ పరిస్థితులు వెళ్లాయి. […]