iDreamPost

ఇంటర్ విద్యార్థిని షాకింగ్ డెసిషన్.. క్లాసులో అందరూ చూస్తుండగానే..!

కర్ణాటకలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి క్లాస్ రూమ్ లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యువతి చేసిన పనికి అంతా షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

కర్ణాటకలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి క్లాస్ రూమ్ లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యువతి చేసిన పనికి అంతా షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

ఇంటర్ విద్యార్థిని షాకింగ్ డెసిషన్.. క్లాసులో అందరూ చూస్తుండగానే..!

పైన ఫోటోలో నవ్వుతూ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు మేఘశ్రీ. ప్రస్తుతం ఈమె ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. రోజూ కాలేజీకి వెళ్తూ తిరిగి హాస్టల్ కు వచ్చేది. అయితే, ఈ అమ్మాయి ఎప్పటిలాగే మంగళవారం కూడా కాలేజీకి వెళ్లింది. మరో విషయం ఏంటంటే? ఆ రోజు పరీక్ష ఉండడంతో అందరూ పరీక్ష రాస్తున్నారు. మేఘశ్రీ కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ విద్యార్థిని షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఉన్నట్టుండి క్లాసులో అందరి ముందే మేఘశ్రీ అలా చేయడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక దేవనాగరె జిల్లాలోని చెన్నపురా గ్రామానికి చెందిన మేఘశ్రీ (18) శివమొగ్గ జిల్లాలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇక్కడే హాస్టల్ ఉంటూ రోజూ కాలేజీకి వెళ్లేది. అయితే, మంగళవారం కాలేజీలో ఎగ్జామ్ ఉండడంతో తోటి స్టూడెంట్స్ తో పాటు పరీక్ష రాస్తుంది. అ క్రమంలోనే.. వాష్ రూమ్ కు వెళ్తున్నానని మేఘశ్రీ క్లాసులో టీచర్ కు చెప్పి వెళ్లింది. కొద్ది నిమిషాలకే అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సీన్ చూసి అంతా షాక్ కు గురయ్యారు. వెంటనే కిందకు దిగి ఆ అమ్మాయిని చూడగా.. రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కాలేజ్ యాజమాన్యం అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం కాలేజీ ముందు ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి మేఘశ్రీ ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు షాక్ కు గురవుతున్నారు. అయితే, ఈ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఈ యువతి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి