iDreamPost
android-app
ios-app

తిరుపతి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణం.. వదిన, ఆమె ఇద్దరు బిడ్డలను పాశవీకంగా

  • Published Jul 25, 2024 | 8:49 AMUpdated Jul 25, 2024 | 8:49 AM

Tirupati Techie Assassinate Brothers Family, Ends His Life: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు.. అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ఆ వివరాలు..

Tirupati Techie Assassinate Brothers Family, Ends His Life: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు.. అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ఆ వివరాలు..

  • Published Jul 25, 2024 | 8:49 AMUpdated Jul 25, 2024 | 8:49 AM
తిరుపతి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణం.. వదిన, ఆమె ఇద్దరు బిడ్డలను పాశవీకంగా

సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మనిషిలో మానవత్వం మచ్చుకైనా కనిపించని రోజులు చూస్తున్నాం. తన, పర బేధం లేకుండా.. దారుణాలకు పాల్పడుతున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. చిన్న చిన్న కారణాలకు అత్యంత భయంకరమైన నేరాలకు పాల్పడుతున్నారు. కనీసం చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు.. అన్న కుటుంబాన్ని అతలాకుతలం చేశాడు. వదిన, ఇద్దరు బిడ్డలపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ వివరాలు..

తిరుపతిలో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు.. తన అన్న కుటుంబంలో ముగ్గురి ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణానికి పాల్పడటానికి ముందు వరకు కూడా మృతుడు.. అన్నతో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత అన్న బయటకు వెళ్లడంతో.. మృతుడు ఇంట్లోకి వెళ్లి అన్న భార్య అనగా వదిన, వారి ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఇంతటి దారుణానికి కారణం.. అతడికి పెళ్లి చేయకపోవడమే అని తెలుస్తోంది. దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

టీపీ దాస్‌ అనే వ్యక్తి.. తిరుపతి పద్మావతి నగర్‌లోని ఓ ఇంట్లో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. దాసు తమ్ముడు మోహన్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఐదేళ్ల క్రితం అనగా.. 2019లో వివాహమైంది. అయితే పెళ్లైన ఏడాదిలోపే అనగా 2020లో మోహన్ భార్య అతడి నుంచి విడిపోయింది. కొన్నాళ్ల తర్వాత.. మోహన్‌ అన్నావదినలు.. అతడికి మరో వివాహం చేశారు. అయితే రెండో భార్య కూడా మోహన్ నుంచి విడిపోయింది. ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్లడంతో మోహన్‌ మానసికంగా కుంగిపోయాడు.

అన్న ఇంటికి వచ్చి..

ఈ క్రమంలో తాజాగా మోహన్‌.. తిరుపతిలోని తన అన్న ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చుని మద్యం సేవించారు. కాసేపటి తర్వాత.. మోహన్‌ అన్న దాస్ ఏదో పని నిమిత్తం.. బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా.. మోహన్ కత్తి తీసుకుని వదిన సునీత, కూతుళ్లు దేవ శ్రీ, నీరజలపై దాడి చేశాడు. వారిని విచక్షణారహితంగా నరికాడు. ముగ్గురు రక్తపు మడుగులో పడిపోగా.. వారి మృతదేహాలను బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే చుట్టుపక్కల జనాలు కనిపించడంతో.. వారిని బయటకు తీసుకెళ్లలేదు. ఆ తర్వాత భయంతో ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక బయటకు వెళ్లిన దాస్ తిరిగి ఇంటికి వచ్చాడు.. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు నెట్టినా తెరుచుకోలేదు. వెంటనే స్థానికులతో కలిసి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాపిల్లలు ముగ్గురు హాలులో రక్తపు మడుగులో పడి ఉండటం చూశాడు

ఇంట్లో లోపలి గదిలోకి వెళ్లి చూడగా.. మోహన్ కూడా‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇక దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. మోహన్ తన పెళ్లి విషయంలో అన్న, వదినలతో గొడవపడినట్లు తెలుస్తోంది. ఆ కోసంతోనే వదిన, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి