iDreamPost

EBC Nestham: మహిళలకు గుడ్‌న్యూస్‌! రేపే ఖాతాల్లోకి రూ.15 వేలు

  • Published Mar 13, 2024 | 9:42 AMUpdated Mar 13, 2024 | 9:42 AM

ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్‌.. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు సీఎం జగన్‌ ప్రతి మహిళ ఖాతాలో 15 వేలు జమచేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్‌.. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు సీఎం జగన్‌ ప్రతి మహిళ ఖాతాలో 15 వేలు జమచేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 13, 2024 | 9:42 AMUpdated Mar 13, 2024 | 9:42 AM
EBC Nestham: మహిళలకు గుడ్‌న్యూస్‌! రేపే ఖాతాల్లోకి రూ.15 వేలు

పేదలను ఆదుకోవడమే ధ్యేయంగా, వారి ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈబీసీకి చెందిన ప్రతి మహిళ ఖాతాలో రూ.15 వేలను గురువారం జమచేయనున్నారు. గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఈబీసీ మహిళ ఖాతాలో ఏడాది రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు నగదును జమచేయనున్నారు. ఈ పథకంతో రూ.45 ఆర్థిక చేయూత అందిచనుంది జగన్‌ సర్కార్‌. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద ఈబీసీ, ఓసీ మహిళలకు మేలు జరగనుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో పేద ఓసీ కుటుంబాలకు కూడా ఆర్థిక తోడ్పాటు అందివ్వనుంది. ఈ పథకంపై ఇప్పటికే ఆ వర్గానికి చెందిన ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. మరి ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి