iDreamPost
android-app
ios-app

Akshay Kumar అక్షయ్ కుమార్ కి రెండోసారి కరోనా.. కేన్ ఫెస్టివల్ కి దూరం

Akshay Kumar అక్షయ్ కుమార్ కి రెండోసారి కరోనా.. కేన్ ఫెస్టివల్ కి దూరం

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గతంలోనే ఆయన కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనాలని అనుకొన్నారు. కరోనా సోకడంతో ఆయన వెళ్ళలేక పోతున్నారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో అక్కడికి వెళ్ళడం లేదని, భారత టీమ్ అందరికీ శుభాకాక్షలు తెలియజేస్తునట్లు ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉండి చికిత్స‌ తీసుకోవడం జరుగుతోందని వెల్లడించారు. క్వారంటైన్ లో ఉంటూ అవసరమైన చికిత్స‌ తీసుకుంటున్నట్లు తెలిపారు.

అక్షయ్ కుమార్ న‌టించిన‌ పృథ్వీరాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కేన్స్ ఫిల్మ్ ఫిస్ట‌వ‌ల్ లో సంగీత దర్శకుడు రెహమాన్, మిల్క్ బ్యూటీ తమన్నా, హీరో మాధవన్ తో బాటు పలువురు సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ పై నడునున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి