iDreamPost
android-app
ios-app

భార్యపై అనుమానం పెంచుకున్నాడు! ఆమె మరో ఇంట్లో ఉండగా!

Karnataka crime News: ఇటీవల భార్యా భర్తల మధ్య అనుమానాలు ఎన్నో దారుణాలకు దారి తీస్తున్నాయి.. ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి.

Karnataka crime News: ఇటీవల భార్యా భర్తల మధ్య అనుమానాలు ఎన్నో దారుణాలకు దారి తీస్తున్నాయి.. ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి.

భార్యపై అనుమానం పెంచుకున్నాడు! ఆమె మరో ఇంట్లో ఉండగా!

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను పెద్దలు, బంధుమిత్రులు నిండు నూరేళ్లు కలిసి ఉండాలని దీవిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లైన కొద్ది నెలలు, సంవత్సరాలకే దంపతులు విడిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో కొంతమంది విడిపోతే.. ఆర్థిక ఇబ్బందులు, ఆదిపత్య పోరు, వివాహేతర సంబంధాల వల్ల మరికొంతమంది విడిపోతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది భార్యాభర్తల మధ్య అనుమానం పెనుభూతంగా మారి విడిపోవడం, ఒకరినొకరు హత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగులుతుంది. తాజాగా ఓ వ్యక్తి అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘన హసన్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హసన్ నగరంలో కె హోసకొప్పలు ఏరియాలో అద్దకు ఉంటున్న దంపతులు శవమై కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. హోలెనరసిపూర్ కు చెందిన దేవరాజ్ (45), మంజుల (35) పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. గార్మెంట్స్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ దంపతులు మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చారు. హాసన్ లో కూడా గార్మెంట్ సంస్థ ఉంది.. అక్కడ పని చేసేందుకు వీలుగా ఉంటుందని దేవరాజ్ అద్దె ఇల్లు తీసుకున్నాడు. సోమవారం హఠాత్తుగా దంపతులు కనిపించకుండా పోయారు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇంటి నుంచి దర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు తెరవగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. భార్యాభర్తలు శవాలుగా పడి ఉన్నారు.

కుటుంబ కలహాల వల్ల ముందుగా భార్యను హత్య చేసి ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసైన దేవరాజ్ నిత్యం భార్యను కొడుతూ ఉండేవాడు. అంతేకాదు భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను హింసిస్గున్నట్లు స్థానికులు తెలిపారు. భర్త వేదింపులు తట్టుకోలేక మంజుల ఓ వ్యక్తి ద్వారా వేరు ఇల్లు తీసుకొని అక్కడే ఉంటుంది. వారం తర్వాత మంజుల వద్దకు వెళ్లి కలిసి ఉంటున్నాడు దేవరాజ్. ఈ క్రమంలోనే భార్యాభర్తలు కనిపించకుండా పోయే సరికి యజమాని ఇంటికి వచ్చి చూడగా.. దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి చూడగా కుల్లిపోయిన స్థితిలో భార్యాభర్తలు కనిపించారు. కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్యకు పాల్పపడిందా, భర్త హత్య చేశాడా? లేదా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోనంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి