iDreamPost
android-app
ios-app

Parijatha Parvam OTT: OTT లోకి క్రైమ్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 07, 2024 | 7:11 PMUpdated Jun 07, 2024 | 7:11 PM

కొత్త కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారో.. మేకర్స్ కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్దీ రోజుల్లో తెలుగులో మరొక సినిమా రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కొత్త కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారో.. మేకర్స్ కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్దీ రోజుల్లో తెలుగులో మరొక సినిమా రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 07, 2024 | 7:11 PMUpdated Jun 07, 2024 | 7:11 PM
Parijatha Parvam OTT: OTT లోకి  క్రైమ్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

అదేంటో తెలియదు కానీ థియేటర్ లో రిలీజ్ అయినపుడు.. ఆయా సినిమాలకు సరిగా రెస్పాన్స్ లేకపోయినా కూడా ఓటీటీ లలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగిపోవడంతో.. ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వారం డైరెక్ట్ గా రిలీజ్ అయినా తెలుగు సినిమాలు మాత్రం అంతగా లేవని చెప్పి తీరాలి. దీనితో మూవీ లవర్స్ కాస్త అప్ సెట్ అయ్యారు. కానీ వచ్చే వారం మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా వాటిలో ఒకటి.

ఈ సినిమా పేరు “పారిజాత పర్వం”. ఔట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమాలో సునీల్, శ్రద్ధా దాస్, వైవా హర్ష, చైతన్య రావు లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. అసలు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందో లేదో కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలీదు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇంద్ర సినిమా విడుదలైన రోజుల్లో భీమవరం నుంచి హైదరాబాద్ కు వస్తాడు సునీల్. ఈ క్రమంలో సినిమా ఆఫర్ల కోసం ఎవరో చెప్పారని బారులో అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మరో వైపు కొరియోగ్రాఫర్ గా వచ్చి.. అదే బార్ లో డ్యాన్సర్ గా చేస్తుంటుంది శ్రద్దా దాస్. అయితే ఆమెను ఓ సమస్య నుంచి కాపాడబోయి సునీల్ ఓ హత్య చేస్తాడు సునీల్. ఆ తర్వాత బార్ శ్రీనుగా మారి దందాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఇతని స్టోరీని కథగా రాసుకుని.. డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు చైతన్య. నిర్మాతలకు కూడా కథ నచ్చుతుంది. కానీ హీరోగా తన ఫ్రెండ్ ను ఉంటానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. దీనితో ఆ నిర్మాత భార్యనే కిడ్నప్ చేసి ఆ డబ్బుతో సినిమా తీయాలని అనుకుంటారు. సరిగ్గా అదే టైమ్ కి మరో గ్యాంగ్ కూడా కిడ్నప్ చేయడానికి వస్తారు. ఎవరు ఎవరిని కిడ్నప్ చేశారు ! ఎవరు ఎవరిని ఎంత డబ్బు డిమాండ్ చేశారు ! చివరి వరకు కథ ఎలా కొనసాగింది ! చివరికి కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి