iDreamPost
android-app
ios-app

Kalyan Ram: ఒక్క సీన్ కోసం ఇన్ని కోట్లా? బిగ్ రిస్క్ చేస్తున్న కల్యాణ్ రామ్!

  • Published Jul 30, 2024 | 5:53 PM Updated Updated Jul 30, 2024 | 5:53 PM

NKR 21: హీరో నందమూరి కల్యాణ్ రామ్ రొటీన్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. విభిన్నమైన కథలతో ఆడియెన్స్​ను థ్రిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

NKR 21: హీరో నందమూరి కల్యాణ్ రామ్ రొటీన్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. విభిన్నమైన కథలతో ఆడియెన్స్​ను థ్రిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

  • Published Jul 30, 2024 | 5:53 PMUpdated Jul 30, 2024 | 5:53 PM
Kalyan Ram: ఒక్క సీన్ కోసం ఇన్ని కోట్లా? బిగ్ రిస్క్ చేస్తున్న కల్యాణ్ రామ్!

టాలీవుడ్​లో కొత్తదనానికి ఎప్పుడూ స్వాగతం పలికే వారిలో నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఒకరు. ఆయన ఎప్పుడూ ఒకే రకం సినిమాలు చేయడానికి ఇష్టపడరు. రొటీన్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకెళ్తుంటారు. ఆడియెన్స్ పల్స్​ను పట్టుకోవడానికి ప్రయత్నించే ఆయన.. ఈ క్రమంలో ఎన్నోమార్లు సక్సెస్ అయ్యారు. ఇటీవల కాలంలో ‘బింబిసార’తో బ్లాక్​బస్టర్ హిట్ అందుకున్నారు కల్యాణ్ రామ్. ఆ తర్వాత వచ్చిన ‘డెవిల్’ ఆ రేంజ్​లో సక్సెస్ కాకపోయినా అందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. వరుస ఆఫర్లు వచ్చినా చాలా సెలెక్టివ్​గా ఉండే కల్యాణ్​ రామ్.. తన మనసుకు నచ్చే చిత్రాల్లో నటించడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కల్యాణ్ రామ్ కొత్త చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక్ క్రియేషన్స్ పతకాలపై ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్వకత్వంలో రూపొందుతున్న ఈ ఫిల్మ్ నుంచి ‘ది ఫీస్ట్ ఆఫ్​ ఫ్రేమ్’ పేరుతో ఇటీవల విడుదలైన గ్లింప్స్​ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ‘ఎన్​కేఆర్ 21’ అనే వర్కింగ్ టైటిల్​తోనే పిలుస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్​లో రీసెంట్​గా క్లైమాక్స్ సీన్ షూట్ చేశారట. అయితే దీని కోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది.

‘ఎన్​కేఆర్ 21’ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి సారథ్యంలో రూ.8 కోట్లు వెచ్చించి భారీ సెట్​ను నిర్మించారని సమాచారం. ఈ యాక్షన్ సీన్​లో ఏకంగా 1,000 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొన్నారట. ఫైట్ మాస్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ క్లైమాక్స్ సీన్స్​ను షూట్ చేశారని తెలుస్తోంది. అయితే ఒక్క సీన్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్ సీన్​ అదిరిపోవడం పక్కా అని అంటున్నారు. దీన్ని బట్టి సినిమాను కూడా లావిష్​గా తీశారని చెబుతున్నారు. మంచి సబ్జెక్ట్ దొరికితే కల్యాణ్ రామ్ కాంప్రమైజ్ కారని.. మంచి క్వాలిటీ కోసం ఆయన ఎలాంటి రిస్క్​కైనా రెడీ అంటారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. మరి.. ‘ఎన్​కేఆర్ 21’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aakashavaani (@theaakashavaani)