Dharani
Dharani
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. త్వరలోనే మెగా ఇంటి కోడలు కానుంది. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల అంగీకరంతో.. తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకునేందుకు ముందడుగు వేశారు. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది అని సమాచారం. ఇరు కుటుంబాలు పెళ్లి ముహుర్తం, వేదిక ఫిక్స్ చేసే పనిలో ఉన్నారంట. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్-లావణ్య ఇద్దరు కలిసి జాలీగా ట్రిప్పులకు వెళ్తూ ఏంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లావణ్య త్రిపాఠికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. అదేంటి అంటే.. ఈ బ్యూటీ అరుదైన జబ్బుతో బాధపడుతుందంట. ఆ వివరాలు..
కొన్ని రోజులుగా కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటి అంటే.. ఆమె ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది అని. ఇంతకు ఆ వ్యాధి ఏంటి అంటే.. ట్రిపోఫోబియా. అయితే లావణ్యకు ఈ వ్యాధి ఉన్నట్లు రెండేళ్ల క్రితం ఆమెనే స్వయంగా వెళ్లడించారు. తనకుకున్న అరుదూన ఈ వ్యాధి గురించి లావణ్య మాట్లాడుతూ.. ‘‘కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే నాకు తెలియకుండానే.. భయం కలుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మెగా ఇంటికి కోడలు కానుండటంతో.. తాజాగా ఈ వార్త మరోసారి తెరమీదకు వచ్చింది.
లావణ్య, వరుణ్ తేజ్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జోడిగా తెరకెక్కిన మిస్టర్ సినిమా సమయంలో ఇద్దరూ లవ్లో పడ్డారు. మిస్టర్ సినిమా 2017లో వచ్చింది. ఆ తర్వాతి ఏడాది వీరిద్దరూ అంతరిక్షం చిత్రంలో జంటగా నటించారు. అలా వారి మధ్య ప్రేమ బంధం బలపడి.. పెళ్లి పీటల వరకు చేరనుంది. ఇక ఈ ఏడాది జూన్ ప్రారంభంలో వీరి నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంఢీవదారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది.