Pakistan Crime News: దారుణం: అర్ధరాత్రి వాష్ రూమ్ కోసం బయటకు వెళ్లిన బాలిక.. కట్ చేస్తే..!

దారుణం: అర్ధరాత్రి వాష్ రూమ్ కోసం బయటకు వెళ్లిన బాలిక.. కట్ చేస్తే..!

ఈ రోజుల్లో కొందరు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి 5 ఏళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకు ఎవరనీ వదలకుండా వారిపై అత్యాచారాలకు పాల్పడి చివరికి హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. అర్థరాత్రి వాష్ రూమ్ కోసం బయటకు వచ్చిన బాలికపై కొందరు దుర్మార్గులు దారుణానికి పాల్పడ్డారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

మీడియ కథనం ప్రకారం.. పాకిస్తాన్ లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. అయితే ఇటీవల ఆ అమ్మాయి అర్థరాత్రి వాష్ రూమ్ కోసమని బయటకు వచ్చింది. ఎంత సేపటికి కూడా కూతురు తిరిగి ఇంట్లోకి రాకపోవడంతో తండ్రి అంతా వెతికాడు. అయినా ఆ బాలిక ఆచూకి మాత్రం దొరకలేదు. ఆ రోజు రాత్రంతా కూతురి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఆ బాలిక మృతదేహం భుట్ట కెనాల్​ వద్ద కనిపించిందని పోలీసులు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ బాలికపై కొందరు గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.

Show comments