SNP
SNP
దేవుడిపై భక్తి ఉండటంలో తప్పులేదు. కానీ, ఆ భక్తి కాస్త మూఢనమ్మకంగా మారితే ఇదిగో ఇలానే ఆస్పత్రి పాలవుతారు. ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలని ఓ వ్యక్తి చేసిన వింత పని అతన్ని ఇప్పుడు ప్రాణాపాయంలో పడేసింది. శివుడి దర్శనం కోసం ఓ పరమ భక్తుడు ఏకంగా తన తలను సమర్పిద్దామని సిద్ధమయ్యాడు. అందుకోసం చెట్లు నరికే కట్టర్తో తన మెడను కోసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రఘునాథ్పురా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
గ్రామానికి చెందిన పల్టూ రామ్ కుమారుడు దీపక్ కుశ్వాహ్(30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి శివభక్తి చాలా ఎక్కువ. నిత్యం పరమశివుడి నామస్మరణ చేస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్య కాలంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా మహాశివుడికి పూజలు చేస్తున్నాడు. ఇల రోజుల తరబడి పూజలు చేస్తుండటంతో కుటుంబసభ్యులు ఎందుకు ఇలా చేస్తున్నావని అడగ్గా.. తాను ఆ మహాశివుడిని ప్రసన్నం చేసుకుంటానని, అందుకోసం ఏమైనా చేస్తానని చెప్పాడు. పైగా శివుడి ప్రసన్నం పొందేందుకు తన మెడను నరుక్కుంటున్నానని కూడా కుటుంబసభ్యలకు తెలిపాడు దీపక్. విషయం తెలిసిన తండ్రి.. దీపక్ను వారించినా.. అతను వినలేదు.
ఉదయం నాలుగు గంటల సమయంలో శివాలయంలోనే చెట్టు కట్ చేసే మెషీన్తో తన మెడను కోసుకుని, గంటలు మోగించాడు. ‘జై భగవాన్ శంకర్’ అంటూ నినాదాలు చేశాడు. ఇది గమనించిన చుట్టపక్కల వారు అక్కడికి చేరుకుని.. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. గతంలో తాను చేసిన పూజల గురించి, శివుడితో తాను మాట్లాతున్న మాటల గురించి, తన ఆత్మబలిదానం గురించి దీపక్ చాలా వివరంగా ఓ పుస్తకంలో రాసుకున్నాడు. అది ఘటనా స్థలంలోనే లభించింది. అయితే.. ప్రస్తుతం దీపక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భక్తి ఉండాలి కానీ, మరి ఇలా అంధవిశ్వాసం పనికిరాదని, దీపక్కు ఏమైనా అయితే.. అతని ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారంటూ స్థానికులు అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రీల్స్ మోజులో భార్య.. హత్య చేసిన భర్త!