ఇటీవల ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మానసిక ఒత్తిడి, కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలానే కొన్ని ఆత్మహత్య, హత్య ఘటనల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఇటీవలే విశాఖలో కానిస్టేబుల్ రమేశ్ హత్య అందుకు ఉదాహరణ. అతడి భార్యే హత్య చేసి.. ఏమి తెలియనట్లు పోలీసుల ముందు నాటకం ఆడింది. చివరకు అసలు విషయం బయటపడి.. జైలు పాలైంది. తాజాగా విశాఖలో సంధ్య అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కూడా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నంలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉన్న నీటి సంపులో ముగ్గురు మృతదేహాలు బుధవారం లభించాయి. మృతులు సంధ్య, ఆమె పిల్లలు గౌతమ్, అలేఖ్యలుగా పోలీసులు గుర్తించారు. అంతేకాక ఆ చనిపోయిన ముగ్గురు అదే అపార్ట్ మెంట్ వాచ్ మెన్ కుటుంబగా స్థానికులు చెబుతున్నారు. సంధ్య కుటుంబం పది నెలల క్రితమే విశాఖకు వలస వచ్చారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. వీరి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు మృతదేహాలను సంపు నుంచి బయటకు తీశారు.
అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వాళ్లు చనిపోయే ముందు రోజు అంటే మంగళవారం అర్ధరాత్రి సంధ్య ఫోన్ నుంచి ఆటో డ్రైవర్ కు ఫోన్ వెళ్లింది. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే సంధ్య.. పిల్లల్ని సదరు ఆటో డ్రైవర్ రోజూ పాఠశాలకు తీసుకెళ్తుండే వాడు. ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్ ను కూడా పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: దారుణం: పరువు తీస్తుందని భార్యను హత్య చేసిన భర్త!