iDreamPost
android-app
ios-app

తగ్గేదే లే అంటున్న వరుణుడు.. మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Telugu States Heavy Rain Alert: జులై మొదటి వారం నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రుతు పవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Telugu States Heavy Rain Alert: జులై మొదటి వారం నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రుతు పవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

తగ్గేదే లే అంటున్న వరుణుడు.. మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి ధరలు దారుణంగా పడిపోయాయి. ఏకంగా 4 రూపాల వరకు తగ్గడంతో బంగారం కొనుగోలుదారులు పండగ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు చుక్కలు చూపించిన పసిడి ఏకంగా అంతగా తగ్గిపోవడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం ఇదర దేశాల నుంచి దిగుమతి సుంకం తగ్గించడంతో పసిడి ధరల్లో భారీ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం పండగలు, శుభకార్యాలు మొదలయ్యాయి..ఈ సమయంలోనే పసిడి కొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో ప్రస్తుతం పండగులు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సీజన్ మొదలైంది. మంగళవారం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పుణ్యమా అని పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇది మధ్యతరగతి కుటుంబీకులకు నిజంగా పండుగే. మొన్నటి వరకు అడ్డగోలుగా పెరిగిపోయిన ధరలు అమాంతం దిగి రావడంతో పసిడి కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. భవిష్యత్ లో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఇప్పుడే కొనిపెట్టుకుంటున్నారు. శనివారం (జులై 27) 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి 62,990కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి 68,720 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.62,990 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,720 వద్ద కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కాకినాడ, కోనసీమ, ఉభయగోదారి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, బాపట్ల జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కూరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదరు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాయలసీమలో కూడా మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు.. ఉరుములులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.  తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి