హిందువుల మనోభావాలు దెబ్బతినకముందే, వారిలో ఆందోళన రాకముందే శ్రీవారి ఆస్తుల వేలంను నిలిపివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వామి పరిపూర్ణానంద కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్కు లేఖ రాశారు. ఇప్పటి వరకూ పని చేసిన ముఖ్యమంత్రులు దేవుళ్లకు, హిందువులకు ఒరగబెట్టింది ఏమీ లేదని పరిపూర్ణానంద ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ పాలకుల నిర్వాకం వల్ల దేవుళ్లకు చెందిన ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం […]