దేశంలో అధికారికంగా మొదటి కరోనా వైరస్ కేసు నమోదు అయ్యింది. కేరళకి చెందిన ఒక వైద్య విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఈ వార్తని కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో వైద్య విద్యనభ్యసిస్తున్న అతడు ఇటీవలే తన స్వస్థలం కేరళ వచ్చినట్టు తెలుస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నఅతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఇటీవలే […]