పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల ఏడాదికి సుమారు 300 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. […]
నదీ జలాల వివాదంపై సంబంధిత బోర్డులు సమావేశం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదం రాష్ట్ర విభజన నుంచి జరుగుతుంది. వివిధ సందర్భాల్లో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం సంప్రదింపులు ద్వారా నదీ జలాల వివాదానికి తాత్కాలిక ముగింపు జరుగుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నదీ జలాల వివాదంపై గతంలోనే సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై […]