ఏపీలో శాసనమండలి వ్యవహారాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఇటీవల జగన్ ప్రభుత్వ నిర్ణయంతో మండలి చుట్టూ మరింత చర్చ సాగుతోంది. తాజాగా ఖాళీల భర్తీ విషయంలో పెద్ద స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయినా అధినేత మనసులో ఏముందనే విషయం అంతుబట్టక సతమతం అవుతున్నారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో నాలుగు ఖాళీలున్నాయి. వాటిలో ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా కారణంగా […]
మహారాష్ట్ర గవర్నర్ తనను ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నియమించాలనే క్యాబినెట్ తీర్మానంపై నిర్ణయాన్ని ప్రకటించకుండా సీఎం ఉద్ధవ్ థాకరేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.అసలే దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తమ రాష్ట్రంలోనే నమోదు అవుతుండటంతో ఆందోళన చెందుతున్న ఉద్ధవ్కు తాజా రాజకీయ పరిణామాలు మింగుడు పడట్లేదు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఆ రాష్ట్ర శాసనమండలిలో సభ్యుడిగా నియమించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి తీర్మానించింది.ప్రస్తుతం మహారాష్ట్ర శాసన మండలి నందు గవర్నరు […]