iDreamPost

ముంబై టీమ్ లో ఇంకా ఆగని గొడవలు! SKY షాకింగ్ పోస్ట్!

తాజాగా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన షాకింగ్ పోస్ట్ సరికొత్త చర్చకు దారితీస్తోంది. మరి సూర్య ఆ పోస్ట్ ఎందుకు చేశాడు? కారణం అదేనా? ఆ వివరాలు..

తాజాగా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన షాకింగ్ పోస్ట్ సరికొత్త చర్చకు దారితీస్తోంది. మరి సూర్య ఆ పోస్ట్ ఎందుకు చేశాడు? కారణం అదేనా? ఆ వివరాలు..

ముంబై టీమ్ లో ఇంకా ఆగని గొడవలు! SKY షాకింగ్ పోస్ట్!

హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం మనకు తెలియనిది కాదు. కానీ ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే ఉండటంతో.. వీరిద్దరు వివాదాన్ని పక్కనపెట్టి ప్రాక్టీస్ కు దిగారు. వీరితో పాటుగా మిగతా ప్లేయర్లు కూడా నెట్స్ లో తీవ్రంగా చమటోడుస్తున్నారు. పైగా పాండ్యా కూడా రోహిత్ గురించి స్పందించడంతో.. గొడవ కొద్దికొద్దిగా సద్దుమణుగుతుందని అందరూ భావించారు. కానీ తాజాగా ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన షాకింగ్ పోస్ట్ సరికొత్త చర్చకు దారితీస్తోంది. మరి సూర్య ఆ పోస్ట్ ఎందుకు చేశాడు? కారణం అదేనా? ఓసారి పరిశీలిద్దాం పదండి.

క్యాష్ ఆన్ ట్రేడ్ విధానం ద్వారా ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీమ్ లోకి రావడమే కాకుండా కెప్టెన్ పగ్గాలను అందుకున్నాడు. అప్పటి నుంచి ముంబై టీమ్ లో కారుచిచ్చు రాజుకుంది. ఆ చిచ్చు కాస్త దావానంలా వ్యాపించి ఇప్పుడు జట్టునే దహించి వేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మంటను ఆర్పకపోతే.. ముంబై టీమ్ కు కప్ రావడం అటుంచి.. టోర్నీలో పరువుపోగొట్టుకోకుండా ఉంటే చాలు అన్న స్థితికి చేరుకుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది ముంబై బ్యాటర్ సూర్యకుమార్ చేసిన షాకింగ్ పోస్ట్.

Suryalumar yadav shocking post

SKY తాజాగా హార్ట్ బ్రేక్ అయిన సింబల్ ను తన ఇన్ స్టా స్టోరీగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. సూర్య ఇలా పోస్ట్ పెట్టడానికి కారణం.. ఐపీఎల్ కోసం ముంబై ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నెట్స్ లో చమటోడుస్తున్నారు ప్లేయర్లు. రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరాడు. అయితే అక్కడ నెలకొంటున్న పరిస్థితులు చూసే సూర్య ఈ పోస్ట్ చేశాడని కొందరు అంటున్నారు. ప్లేయర్లకు మధ్య పడట్లేదని, ఏదో జట్టులో ఉండాలి కాబట్టి అన్నట్లుగా ఆడుతున్నారని తెలుస్తోంది. గొడవలు ఇంకా సద్దుమణగలేదని స్కై పోస్ట్ ను చూస్తే అర్దమవుతోంది.

రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తీసేసిన తర్వాత కూడా సూర్య ఇలాంటి పోస్టే చేశాడు. రోహిత్ కు సూర్యకు మంచి బాండింగ్ ఉంది. దీంతో కెప్టెన్ గా అతడిని తీసేయడంతో.. అప్పటి నుంచి బాధలో ఉన్నాడు మిస్టర్ ఇండియన్ 360 ప్లేయర్. ఇదిలా ఉండగా.. కాలికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్ లకు సూర్య దూరం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహ్యాబ్‌ అవుతున్న సూర్యకు.. ఎన్‌సీఏ ఎన్‌ఓసీ ఇవ్వకపోవడంతో సూర్య ఈ పోస్ట్‌ చేసినట్లు కూడా టాక్‌ వినిపిస్తోంది. మరి ముంబై టీమ్ లో ఇంకా గొడవలు సద్దుమణగలేదా? అందుకే సూర్య ఈ షాకింగ్ పోస్ట్ పెట్టాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL జట్లన్నీ ఆ మృగం గురించే భయపడుతున్నారు! వాడిని ఆపే మగాడు ఎవరు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి