iDreamPost

టమాట రైతును దారుణ హత్య చేసిన దుండగులు! ఎక్కడో కాదు..!

కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో టమాట ధర రూ.180 నుంచి 250 వరకు పలుకుతుండడం విశేషం. దీంతో ప్రజలు టమాటను వాడకుండానే కూరలు వండుకుంటున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే ఓ టమాట రైతును కొందరు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో టమాట ధర రూ.180 నుంచి 250 వరకు పలుకుతుండడం విశేషం. దీంతో ప్రజలు టమాటను వాడకుండానే కూరలు వండుకుంటున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే ఓ టమాట రైతును కొందరు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

టమాట రైతును దారుణ హత్య చేసిన దుండగులు! ఎక్కడో కాదు..!

గత కొన్ని రోజుల నుంచి టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు టమాటను కొనాలంటే భయంతో వెనకడుగు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో టమాట ధర రూ.180 నుంచి 250 వరకు పలుకుతుండడం విశేషం. దీంతో ప్రజలు టమాటను వాడకుండానే కూరలు వండుకుంటున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే ఓ టమాట రైతును కొందరు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాజారెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి తన సొంత ఊరిలో దాదాపు 20 ఎకరాల పొలం ఉంది. దీంతో పాటు పాడి పశువులు కూడా ఉన్నాయి. అయితే, రాజారెడ్డి ఉన్న 20 ఎకరాల్లో నాలుగు ఎకరాల్లో పూర్తిగా టమాట పంట పండించాడు. ప్రస్తుతం టమాట ధరకు అధిక డిమాండ్ ఉండడంతో ఆ రైతు డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. కాగా, రోజూ టమాటను మార్కెట్ కు తీసుకెళ్లి తిరిగి ఇంటికి వస్తుండేవాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి రాజారెడ్డి పక్క గ్రామంలో పాలు పోసి ఇంటికి వస్తుండగా అతడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యలో అడ్డగించారు.

ఆ తర్వాత అతడి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అతని గ్రామస్తులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద టమాట విక్రయించిన బిల్లులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: తాగుబోతు కొడుకు దారుణం.. తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నడి రోడ్డుపై..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి