iDreamPost

ద్రవిడ్​, లక్ష్మణ్​కు అదనపు బాధ్యతలు.. BCCI టార్గెట్​ను ఇద్దరూ రీచ్ అవుతారా?

  • Published Mar 19, 2024 | 3:37 PMUpdated Mar 19, 2024 | 3:37 PM

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్​కు భారత క్రికెట్ బోర్డు అదనపు బాధ్యతలు అప్పగించింది. ద్రవిడ్​తో పాటు ఎన్​సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్​కూ ఓ టార్గెట్ ఇచ్చింది బీసీసీఐ.

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్​కు భారత క్రికెట్ బోర్డు అదనపు బాధ్యతలు అప్పగించింది. ద్రవిడ్​తో పాటు ఎన్​సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్​కూ ఓ టార్గెట్ ఇచ్చింది బీసీసీఐ.

  • Published Mar 19, 2024 | 3:37 PMUpdated Mar 19, 2024 | 3:37 PM
ద్రవిడ్​, లక్ష్మణ్​కు అదనపు బాధ్యతలు.. BCCI టార్గెట్​ను ఇద్దరూ రీచ్ అవుతారా?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడే. మండు వేసవిలో మరింత హీటెక్కించేందుకు క్యాష్ రిచ్ లీగ్ వచ్చేస్తోంది. ధనాధన్ క్రికెట్​తో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మరో మూడ్రోజుల్లో మెగా లీగ్ మొదలుకానుంది. లీగ్​ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అటు అన్ని ఫ్రాంచైజీల ప్లేయర్లు ప్రాక్టీస్​లో బిజీ అయిపోయారు. ఈ తరుణంలో భారత క్రికెట్​కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అందరూ ఐపీఎల్ హడావుడిలో ఉండగా.. బీసీసీఐ మాత్రం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్​ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్​తో సమావేశమైందని తెలుస్తోంది.

ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్​కు బీసీసీఐ అదనపు బాధ్యతలు అప్పజెప్పిందట. వీళ్ల ముగ్గురికీ బోర్డు కొత్త టార్గెట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రికెట్​లో భారీ మార్పులు తీసుకురావాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్​తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని వినికిడి. దేశవాళీ క్రికెట్​లో తీసుకురావాల్సిన మార్పుల గురించి బోర్డుకు అవసరమైన సలహాలు, సూచనలను ఈ కమిటీ ఇవ్వనుందని సమాచారం. ఫస్ట్​ క్లాస్ క్రికెట్​ను మరింత మెరుగుపర్చడం, భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్లను సానబెట్టడం, ఫిట్​నెస్ నుంచి క్రమశిక్షణ వరకు చాలా విషయాల్లో ఈ కమిటీ సూచనలు చేయనుందట.

ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్​ తాము ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల్లో ఉంటూనే ఆ కమిటీలో భాగం కానున్నారని తెలుస్తోంది. బీసీసీఐకి సలహాలు, సూచనలను ఇస్తూనే డొమెస్టిక్ క్రికెట్​లో నిరంతరం జరిగే మార్పులను మానిటరింగ్ చేస్తూ ఉండాలట. రంజీ ట్రోఫీ లాంటి పలు దేశవాళీ టోర్నమెంట్ల నిర్వహణ సమయంలో పలు చోట్ల త్వరగా చీకటి పడటం, ముఖ్యంగా ఆ సీజన్​లో నార్త్ ఇండియాలో బ్యాడ్ వెదర్ వల్ల ఇబ్బందులు నెలకొంటున్నాయి. డిసెంబర్-జనవరి విండోలో టోర్నీ ఉండటంతో చాలా మ్యాచులు తుడిచిపెట్టుకుపోతున్నాయి.

ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో ఉన్న పలు సమస్యలకు పరిష్కారాలు వెతకడం, సూచనలు ఇవ్వడం ఈ కమిటీ బాధ్యతలు అని క్రికెట్ వర్గాల సమాచారం. ఈ కమిటీతో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియాతో కలిపి ద్విసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూకు బోర్డు నుంచి అసోసియేట్ మెంబర్​షిప్ ఇవ్వాలా? వద్దా? అనేది ఈ కమిటీ తేల్చనుందట. మరి.. ద్రవిడ్​, లక్ష్మణ్​కు బీసీసీఐ నయా టార్గెట్ సెట్ చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL జట్లన్నీ ఆ మృగం గురించే భయపడుతున్నారు! వాడిని ఆపే మగాడు ఎవరు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి