Nidhan
కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. మాజీ సారథి రోహిత్ శర్మ అభిమానులు ఆ టీమ్ను టార్గెట్ చేసుకొని మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. మాజీ సారథి రోహిత్ శర్మ అభిమానులు ఆ టీమ్ను టార్గెట్ చేసుకొని మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
Nidhan
ఐపీఎల్-2024 ఆక్షన్కు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ క్రికెట్ దునియాను షేక్ చేసింది. ఐదు ట్రోఫీలు అందించిన సక్సెస్ఫుల్ కెప్టెన్ను ఇలా అర్ధంతరంగా తీసేయడం మీద తీవ్ర దుమారం రేగింది. హ్యూజ్ ఫ్యాన్ బేస్ కలిగిన హిట్మ్యాన్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ను అవమానించారంటూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో ముంబైపై రివేంజ్ తీర్చుకుంటున్నారు. లక్షలాది మంది హిట్మ్యాన్ ఫ్యాన్స్ ఎంఐని అన్ఫాలో చేస్తున్నారు. దీంతో ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ మీద భారీగా ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో ముంబైకి మరో షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి. ఎంఐ మెంటార్ పోస్ట్కు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గుడ్ బై చెప్పాడని వినిపిస్తోంది.
రోహిత్ శర్మను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించడం, తాము చెప్పిందే ఫైనల్ అంటూ అహంకారంగా ప్రవర్తించిన ముంబై ఫ్రాంచైజీపై సచిన్ సీరియస్గా ఉన్నాడట. హార్దిక్ పాండ్యాకు హఠాత్తుగా సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం, ఇన్ని ట్రోఫీలు అందించిన హిట్మ్యాన్ను తప్పించడం క్రికెట్ దేవుడికి నచ్చలేదట. ముంబై తీరుపై అసంతృప్తిగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ ఆ టీమ్ మెంటార్ పదవికి రాజీనామా చేశాడని టాక్. ఇప్పటికే సచిన్ తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేశాడని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇదే విషయంపై ఓ నేషనల్ మీడియా ఛానల్ మాస్టర్ను డైరెక్ట్గా సంప్రదించిందని తెలుస్తోంది. ఇవన్నీ ఒట్టి రూమర్లేనని.. ఇందులో ఏమాత్రం నిజం లేదని సచిన్ కొట్టిపారేశాడని సమాచారం. అతడు మెంటార్గా కొనసాగుతాడని.. రూమర్లను నమ్మొద్దని ముంబై ఫ్రాంచైజీ వర్గాలు కూడా నేషనల్ మీడియాకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సచిన్ తన పదవిలో కంటిన్యూ అవుతాడని పలు రిపోర్టులూ పేర్కొంటున్నాయి. కాగా, ముంబై ఇండియన్స్కు 2014 నుంచి మెంటార్గా సేవలు అందిస్తున్నాడు సచిన్. ఐదు సీజన్ల పాటు ఆ టీమ్కు ఆడిన మాస్టర్ బ్లాస్టర్.. కెప్టెన్గానూ ముందుండి లీడ్ చేశాడు. ఓవరాల్గా ఐపీఎల్ కెరీర్లో 78 మ్యాచులు ఆడిన టెండూల్కర్ 2,334 రన్స్ చేశాడు. ముంబై టీమ్లోని ప్లేయర్ల మధ్య ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయడంలో అతడు సక్సెస్ అయ్యాడు. దాన్ని ఆ తర్వాత కాలంలో కెప్టెన్గా మారిన రోహిత్ శర్మ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఇక, కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా విమర్శలపాలైన ముంబై.. సోషల్ మీడియాలో చాలా రకాలుగా టార్గెట్ అవుతోంది. దీనికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. మరి.. సచిన్ మెంటార్ పోస్ట్ నుంచి తప్పుకున్నాడంటూ వార్తలు రావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Steve Smith: వీడియో: మ్యాచ్ మధ్యలో స్మిత్ పేపర్ క్యాచ్! మారుమోగిన స్టేడియం
Sachin Tendulkar is still the mentor of Mumbai Indians. pic.twitter.com/qglGsMxERX
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2023
Sachin Tendulkar is still the mentor of Mumbai Indians.
– The news circulating in social media is fake. pic.twitter.com/aelZssqsGw
— Johns. (@CricCrazyJohns) December 17, 2023