iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో అమ్మాయిల మిస్సింగ్!

హైదరాబాద్ లో అమ్మాయిల మిస్సింగ్!

గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో బాలికలు, అమ్మాయిల మిస్సింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. కనిపించకుండా పోయి చివరికి శవాలై తేలిని కేసులు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో మిస్సింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో ఏకంగా ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండాపోయారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంచాల ప్రియా (19) అనే యువతి హైదరాబాద్ లోని చిల్డ్రన్స్ హోమ్ లో ఉంటుంది. గత కొంత కాలం నుంచి ఇష్టం లేకున్న ఈ అమ్మాయి అక్కడే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే హోమ్ నుంచి బయటకు వచ్చి అందులో వంట చేసే ఓ మహిళ ఇంట్లో ఉంటుంది. అయితే అక్టోబర్ 15న ప్రియా ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. దీంతో మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. దుక్క కోటేశ్వరి (23) అనే యువతి నగరంలోని రహమత్ నగర్ లో నివాసం ఉంటుంది. జూబ్లీహిల్స్ లోని ఓ షోరూమ్ లో పనికి వెళ్లేది. కాగా, ఆదివారం అర్థరాత్రి ఆ యువతి ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం తీసుకుని కనిపించకుండాపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి