iDreamPost
android-app
ios-app

వరద బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారంటే?

  • Published Sep 03, 2024 | 4:55 PM Updated Updated Sep 03, 2024 | 5:04 PM

Tollywood Stars Donates Massively For Flood Relief: ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సాయం చేయడానికి టాలీవుడ్ స్టార్స్ ముందుంటారు. మరోమారు సినీ తారలు తమ గొప్ప మనసు చాటుకున్నారు.

Tollywood Stars Donates Massively For Flood Relief: ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సాయం చేయడానికి టాలీవుడ్ స్టార్స్ ముందుంటారు. మరోమారు సినీ తారలు తమ గొప్ప మనసు చాటుకున్నారు.

  • Published Sep 03, 2024 | 4:55 PMUpdated Sep 03, 2024 | 5:04 PM
వరద బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారంటే?

సినిమాలు చూస్తూ తమను ఇంతగా ఆదరించే, అభిమానించే ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, విపత్తు ముంచెత్తినా సాయం చేసేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుంటారు. కష్టం వచ్చిందని తెలిస్తే అక్కడికి కదిలొస్తారు. తమ చేతనైనంత సాయం చేస్తూ వాళ్లకు అండగా నిలుస్తారు. మరోమారు తెలుగు స్టార్స్ తమ గొప్ప మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వానలు, వరదల కారణంగా చాలా మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వరద బాధితులకు టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు డొనేషన్స్ ప్రకటించారు. ఎవరెవరు ఎంతిచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

వరద బాధితుల సాయం కోసం చేపట్టే చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.50 లక్షలు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ.50 లక్షల్ని ఇచ్చారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.50 లక్షలు ఇస్తున్నట్లు బాలయ్య ప్రకటించారు. ఉభయ రాష్ట్రాల్లో అతి త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆయన ప్రార్థించారు. యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా తారక్, బాలయ్య బాటలో నడుస్తూ డొనేషన్ అనౌన్స్ చేశారు. ఏపీ, తెలంగాణకు కలిపి ఆయన రూ.30 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.15 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.15 లక్షలు ఇచ్చారు. మరో యంగ్ హీరో, మాస్​ కా దాస్ విశ్వక్​సేన్ ఏపీ, తెలంగాణకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

Donation for VJD floods

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​, స్టార్ ప్రొడ్యూసర్స్ సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), సూర్యదేవర నాగవంశీ కలసి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ఓ ప్రకనటలో వెల్లడించారు. భారీ వానల వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న భారీ ఆస్తి, ప్రాణ నష్టం తమను ఎంతగానో కలసివేసిందని త్రివిక్రమ్, చినబాబు, నాగవంశీ పేర్కొన్నారు. ఈ విపత్తు నుంచి ప్రజల్ని దేవుడు కాపాడాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. తమ వంతు సాయంగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్స్ విరాళాలు అందజేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో ఇలా సినీ ప్రముఖులు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించడం మంచి విషయమని ప్రశంసిస్తున్నారు. ఇదే క్రమంలో మరింత మంది స్టార్స్ సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నారు.