iDreamPost
android-app
ios-app

Rashmi Gautam: ఆ ఫుడ్ తీసుకోండి…అదిరిపోయే హెల్త్ టిప్ చెప్పిన రష్మీ!

రష్మీ గౌతమ్.. ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం  అక్కర్లేదు. ఆమె యాంకర్ గానే కాకుండా హీరియిన్ గా మంచి గుర్తింపు సంపాందించింది. తాజాగా ఈ అమ్మడు ఓ అదిరిపోయే హెల్త్ టిప్ ఇచ్చింది.

రష్మీ గౌతమ్.. ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం  అక్కర్లేదు. ఆమె యాంకర్ గానే కాకుండా హీరియిన్ గా మంచి గుర్తింపు సంపాందించింది. తాజాగా ఈ అమ్మడు ఓ అదిరిపోయే హెల్త్ టిప్ ఇచ్చింది.

Rashmi Gautam: ఆ ఫుడ్ తీసుకోండి…అదిరిపోయే హెల్త్ టిప్ చెప్పిన రష్మీ!

ప్రతి ఒక్కరి ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం. నేటి కాలంలో హెల్త్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంత మంచిది. లేకుంటే.. అనేక రకాల అనారోగ్యాలకు గురికాక తప్పదు. ఇక హెల్త్ విషయంలో సెలబ్రిటీలు  ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. అంతేకాక తమ అభిమానులతో పాటు అందరికి హెల్త్ కు సంబంధించిన విషయాలను చెబుతుంటారు. అలానే తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్… కూడా ఓ అదిరిపోయే హెల్త్ టిప్ ను చెప్పింది. వారానికి ఐదు రోజులు ఆ ఫుడ్ తినండి అంటూ ఓ హెల్త్ సీక్రెట్ ను చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రష్మీ గౌతమ్.. ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె యాంకర్ గానే కాకుండా హీరియిన్ గా మంచి గుర్తింపు సంపాందించింది. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించింది. అయితే జబర్దస్త్ షో ద్వారా ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. తనదైన  మాటలతో, పంచ్ లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక తన అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో దేవతలా గుడి కట్టుకుంది అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై  అనేక షోల్లో యాంకరింగ్ చేస్తూనే…సినిమాల్లో మెరిసింది. ముఖ్యంగా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి ఆమె చేసే కామెడీ, కమెస్ట్రీ అందరిని ఏ రేంజ్ లో ఆకట్టుంది. రష్మీ తన యాంకరింగ్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో బుల్లితెరపై షో ల నుంచే సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు సంపాదించింది. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ నటించి మెప్పించింది. రష్మీ..గుంటూరు టాకీస్ వంటి పలు సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది.

ఇలా సినిమాలతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ..సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ముఖ్యంగా పలు అంశాలపై రష్మీ స్పందిస్తుంది. అదే విధంగా అప్పుడప్పుడు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఆరోగ్యానికి సంబంధించి ఓ హెల్త్  టిప్ ను రష్మీ చెప్పింది. తాజాగా రేష్మి గౌతమ్ మాట్లాడుతూ… “వారంలో 5 రోజులు వెజ్ ఫుడ్ తీసుకోవాలని తెలిపింది. అలానే మిగిలిన రెండు రోజులులు నాన్ వెజ్ ఐటెమ్స్ తిన్నాలని తెలిపింది. పూర్వం చాలా మంది వారంలో ఎక్కువ శాతం వెజిటేరియన్ ఫుడ్ తినేవారు. అందుకే వారు ఎక్కువ కాలం చాలా ఆరోగ్యంగా బ్రతికారు.

ఇక ప్రస్తుత కాలంలో అందుకు భిన్నంగా తయారు అయ్యారు. చాలా మంది వారంలో ఎక్కువ రోజులు మాంసాహార ఆహార పదార్ధాలను తింటున్నారు. అందుకే నేటికాలంలో చాలా మందికి తక్కువ ఏజ్ లోనే ఆరోగ్య సమస్యలు వచ్చి మరణిస్తున్నారు. అందుకే కచ్చితంగా వారం రోజుల్లో ఐదు రోజులు శాఖాహారం మాత్రమే తినేలా చూసుకోండి. మిగిలిన రోజులు మాత్రమే నాన్ వెజ్ మీ ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడండి” అంటూ రష్మి గౌతమ్ ఆరోగ్య సలహా ఇచ్చింది. దీంతో రష్మీపై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా చక్కగా చెప్పావంటూ అభినందిస్తున్నారు. మరి.. రష్మీ ఇచ్చిన హెల్త్ టిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.