iDreamPost
android-app
ios-app

16 ఏళ్ల క్రితమే పూరీ జగన్నాథ్ కేజీఎఫ్ స్టోరీ చెప్పారా? వీడియో వైరల్

  • Published Jul 24, 2024 | 10:39 PMUpdated Jul 24, 2024 | 10:39 PM

Netizens Shared A Video That Shows KGF Story Similar To Neninthe Movie Scene: పూరీ జగన్నాథ్ చెప్పే డైలాగులు గన్ లోంచి వచ్చే బుల్లెట్స్ లా ఉంటాయి. ఒక్కొక్కరినీ కొట్టినట్టు ఉంటాయి. అయితే పూరీ జగన్నాథ్ 16 ఏళ్ల క్రితమే కేజీఎఫ్ సినిమా స్టోరీ చెప్పారని ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Netizens Shared A Video That Shows KGF Story Similar To Neninthe Movie Scene: పూరీ జగన్నాథ్ చెప్పే డైలాగులు గన్ లోంచి వచ్చే బుల్లెట్స్ లా ఉంటాయి. ఒక్కొక్కరినీ కొట్టినట్టు ఉంటాయి. అయితే పూరీ జగన్నాథ్ 16 ఏళ్ల క్రితమే కేజీఎఫ్ సినిమా స్టోరీ చెప్పారని ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Published Jul 24, 2024 | 10:39 PMUpdated Jul 24, 2024 | 10:39 PM
16 ఏళ్ల క్రితమే పూరీ జగన్నాథ్ కేజీఎఫ్ స్టోరీ చెప్పారా? వీడియో వైరల్

పూరీ జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎక్స్ ప్రెస్ వేగంతో సినిమాలను తెరకెక్కించడంలో పూరీ జగన్నాథ్ కి పేరుంది. హీరోలని ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వడంలో పూరీని కొట్టేవారు లేరు. అంతలా పూరీ ఇంట్రడక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి.  ఈ మధ్య కాలంలో హీరోలకి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తున్న డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు. కేజీఎఫ్ లో యష్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. సలార్ లో ప్రభాస్ కి కూడా అదే రేంజ్ ఎలివేషన్స్ చూపించారు. ఎలివేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్, ప్రశాంత్ నీల్ గురించి ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అదేంటంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీలో యష్ కొన్ని షాట్స్ ని.. 16 ఏళ్ల క్రితమే పూరీ జగన్నాథ్ ఊహించడం. అవును 16 ఏళ్ల క్రితం అంటే 2008లో వచ్చిన నేనింతే సినిమాలో వేణు మాధవ్ సుబ్బరాజ్ దగ్గరకు వెళ్లి కథ చెప్పే సన్నివేశం ఉంటుంది. ‘కనులెంది ఒరు జూమ్ బ్యాక్ వంద ఫస్టు షాట్.. అవ ఇంట్రడక్షన్ ఎందన్న పాతిక రైళ్లు గాల్లో దడ దడ దడ అదిదా హీరో ఇంట్రడక్షన్. హీరో చెప్పులు కుట్టుకుంటాడు. బెంజ్ కారులో దిగుతాడు. అమ్మ సెంటిమెంట్’ అంటూ వేణుమాధవ్ సుబ్బరాజ్ కి తెలుగు, తమిళ్ భాషల్లో మిక్స్ చేసి ఒక కథ చెప్తారు. ఆ కథ చెప్తుంటే అప్పట్లో నవ్వుకున్నాం. కానీ అదే సీన్ ఇప్పుడు కేజీఎఫ్ లో ప్రశాంత్ నీల్ వాడారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వేణుమాధవ్ చెప్పినట్టే ఎగ్జాక్ట్ గా కేజీఎఫ్ మూవీలో షాట్స్ ఉండడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ నేనింతే మూవీ చూసి కాపీ కొట్టాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా నేపథ్యంతో సాగే ఈ సినిమాలో రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా రవితేజకి, బెస్ట్ డైలాగ్ రైటర్ గా పూరీ జగన్నాథ్ కి నంది అవార్డులు వచ్చాయి. కాగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో సంజయ్ దత్ నటిస్తుండడం విశేషం. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీ 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by prame (@prameela._padmavathi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి