iDreamPost
android-app
ios-app

రాజమౌళితో మూవీ.. నిర్మాతలకు మహేశ్ స్పెషల్ రిక్వెస్ట్..

  • Published Sep 12, 2024 | 4:06 PM Updated Updated Sep 12, 2024 | 4:06 PM

Mahesh Babu: దర్శకుడు రాజమౌళి ప్రాజెక్ట్ తో మహేశ్ త్వరలోనే పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులను అలరించనున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మహేష్ నిర్మాతలకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అదేమిటంటే..

Mahesh Babu: దర్శకుడు రాజమౌళి ప్రాజెక్ట్ తో మహేశ్ త్వరలోనే పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులను అలరించనున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మహేష్ నిర్మాతలకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అదేమిటంటే..

  • Published Sep 12, 2024 | 4:06 PMUpdated Sep 12, 2024 | 4:06 PM
రాజమౌళితో మూవీ.. నిర్మాతలకు మహేశ్ స్పెషల్ రిక్వెస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ‘SSMB29’ మూవీ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఈ కాంబో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై ఇటు ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి చిన్న అప్డేట్ రాలేదు. కానీ, ఈ ప్రాజెక్ట్ పై నెట్టింట ఎప్పుడు బజ్ నడుస్తునే ఉంటుంది.ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మహేష్ నిర్మాతలకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అదేమిటంటే..

దర్శకుడు రాజమౌళి ప్రాజెక్ట్ తో మహేశ్ త్వరలోనే పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులను అలరించనున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాతో మహేష్ పరిచయమవ్వబోతున్నాడు. ఈ సందర్భంగా.. మహేష్ ఓ నిర్ణయానికి వచ్చారట. అంతేకాకుండా.. నిర్మాతలకు ఈ సినిమా విషయంలో ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశారట. అదేమిటంటే.. మహేష్ తాను నటిస్తున్న SSMB29 మూవీ థియేటర్స్ లో విడుదలయ్యే వరకు.. ఇంత వరకు తాను నటించిన ఏ చిత్రాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయుద్దని నిర్మతలను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇక టాక్ విన్న మహేష్ ఫ్యాన్స్.. తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేమై ఉంటుందని తెగ ఆలోచిస్తున్నారు. కానీ, నిజానికి మహేష్ ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాలో నటించలేదు. అయితే SSMB29 మూవీతోనే బాలీవుడ్ వెండితెరపై తొలిసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పైగా రాజమౌళి దర్శకత్వంలో కాబట్టి, ఫ్రెష్ కంటెంట్ తో ప్రేక్షకులకు కొత్తగా పరిచయవ్వాలని మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బాలీవుడ్ లో ఎక్కడ కూడా తన పాత సినిమాలు రిలీజ్ చేయకూడదని ముందు నుంచే మహేష్ జాగ్రత్తపడుతూ.. నిర్మాతలకు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే మహేష్ SSMB29 మూవీకి సంబంధించి అప్డేట్ మరీంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరొపక్క కొత్త సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక అప్డేట్స్ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం విదేశీ నటులను ఎంపిక చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. అలాగే ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరీ, మహేశ్ SSMB29 మూవీ విడుదలకు ముందు బాలీవుడ్ లో తన సినిమాలేవీ విడుదల చేయవద్దని నిర్మాతలకు కోరడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.