iDreamPost
android-app
ios-app

పూరి జగన్నాథ్ తో పోటిపై స్పందించిన హరీష్ శంకర్.. ఇంతకీ ఏమన్నాడంటే

  • Published Jul 29, 2024 | 1:56 PM Updated Updated Jul 29, 2024 | 1:56 PM

Harish Shankar: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెకక్నున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో పూరి డబల్ ఇస్మార్ సినిమాకు పోటీగా మిస్టర్ బచ్చన్ రిలీజ్ చేస్తున్నరా అని ఓ జర్నలిస్ట్ హరీశ్ శంకర్ కు ప్రశ్నించారు. ఇక ఆ ప్రశ్నకు హరీశ్ శంకర్ అదిరిపోయే సమాధానం తెలిపారు.

Harish Shankar: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెకక్నున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో పూరి డబల్ ఇస్మార్ సినిమాకు పోటీగా మిస్టర్ బచ్చన్ రిలీజ్ చేస్తున్నరా అని ఓ జర్నలిస్ట్ హరీశ్ శంకర్ కు ప్రశ్నించారు. ఇక ఆ ప్రశ్నకు హరీశ్ శంకర్ అదిరిపోయే సమాధానం తెలిపారు.

  • Published Jul 29, 2024 | 1:56 PMUpdated Jul 29, 2024 | 1:56 PM
పూరి జగన్నాథ్ తో పోటిపై స్పందించిన హరీష్ శంకర్.. ఇంతకీ ఏమన్నాడంటే

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఇక ఈ సినిమాను డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ నటిస్తుంది. అలాగే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించానున్నారు. ఇకపోతే రవితేజ, హరీష్ కాంబినేషన్ లో రానున్న మిస్టర్ బచన్ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఎప్పుడెప్పుడు రవితేజ సినిమా థియేటర్ లోకి వస్తుందో, చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ టీజర్ కార్యక్రమం నిన్న( ఆదివారం జులై 29వ తేదీన) నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలోనే హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాను మరోక సినిమాకు పోటిగా అదే రోజున ఎందుకు రిలీజ్ చేస్తున్నారని ఓ జర్నలిస్ట్ హరీష్ శంకర్ కు ప్రశ్నించారు. దీనికి డైరెక్టర్ హరీశ్ శంకర్ తనదైన స్టైల్ లో అదిరిపోయే సమాధానం తెలిపారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో హీరోయిన్ తో పాటు, దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ కు ఓ జర్నలిస్టు.. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పోటిగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే ప్రశ్న వేశారు. ఇక ఈ ప్రశ్నకు హరీశ్ శంకర్ అదిరిపోయే సమాధానం తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘నన్ను పూరి జగన్నాథ్ తో నేను ఎప్పుడు పోల్చుకోను. ఎందుకంటే.. ఆయన ఓ లెజెండరీ డైరెక్టర్, ఆయనతో నేను ఎప్పుడు పోటీ పడను. ఇక ఓటీటీ సంస్థల ఒత్తిడి వలన కాస్త అనుకున్న డేట్ కంటే ముందుగా సినిమా రిలీజ్ చేయడంతో డేట్ క్లాష్ అవుతోంది.

అలాగే ముందుగా డబుల్ ఇస్మార్ట్ డేట్ ఫైనల్ చేశారు. కానీ, మా సినిమాకు ఫైనాన్షియల్ కారణాల వలన అదే డేట్ కు సినిమా రిలీజ్ చేస్తున్నాం. కేవలం ఒక్క సినిమా క్లాష్ వలన నాకు పూరికి మాటాలు ఉండవు అని నేను అనుకోను, ఆయన కూడా అనుకోరు. ఇకపోతే  మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయమని మైత్రీ మూవీస్ శశి సలహా ఇచ్చింది పూరి, రామ్  మీద పోటీ కోసం కాదు. నిజం చెప్పాలంటే.. నా తర్వాత సినిమా రామ్ తో చేయబోతున్నాను మరీ , అలాంటప్పుడు క్లాష్ కు ఎందుకు వెళ్లాను. అయితే మేము తప్పక రావాల్సి వస్తుంది కాబట్టి అర్ధం చేసుకుంటారని అని అనుకుంటున్నాను. అంతేకాకుండా.. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ రెండు బ్లాక్ బస్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను’ అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. మరీ,  డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల డేట్ కు మిస్టర్ బచ్చన్  రిలీజ్ చేయడం పై హరీశ్ శంకర్ క్లారీట్ ఇస్తూ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss