iDreamPost
android-app
ios-app

Dil Raju: గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ షేక్ అవుతుంది.. దిల్ రాజు కామెంట్స్! ఫ్యాన్స్ కు పూనకాలే

  • Published Aug 28, 2024 | 4:09 PM Updated Updated Aug 28, 2024 | 4:09 PM

Game Changer, Ram Charan, Dil Raju: దిల్ రాజు చేసిన లేటెస్ట్ కామెంట్స్ గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వ్యాఖ్యలు చేశాడు. దాంతో పాటుగా విడుదల వాయిదా వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

Game Changer, Ram Charan, Dil Raju: దిల్ రాజు చేసిన లేటెస్ట్ కామెంట్స్ గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వ్యాఖ్యలు చేశాడు. దాంతో పాటుగా విడుదల వాయిదా వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

Dil Raju: గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ షేక్ అవుతుంది.. దిల్ రాజు కామెంట్స్! ఫ్యాన్స్ కు పూనకాలే

గేమ్ ఛేంజర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా. చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే గతంలోనే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. అయినప్పటికీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ వాయిదా అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి.ఇక ఈ విషయంపై దిల్ రాజు మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పాటుగా చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే కామెంట్స్ చేశాడు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్మాత ప్రకటించినప్పటికీ.. ఈ మూవీ వాయిదా పడుతుందని రూమర్లు వైరల్ గా మారాయి. కొన్ని సీన్లను రీ షూట్ చేయాలని దిల్ రాజుకు శంకర్ చెప్పినట్లుగా న్యూస్ వినిపించింది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టడమే గాక.. గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే కామెంట్స్ చేశాడు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ప్రోగ్రామ్ కు హాజరైన ఆయన మాట్లాడుతూ..

dil raju comments about game changer

“గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కచ్చితంగా సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నాం. ఈ మూవీ రామ్ చరణ్, శంకర్ సర్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. పొలిటికల్ డ్రామాతో పాటుగా సామాజిక కోణంలో ఈ మూవీని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. శంకర్ సర్ ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు చేశారు. కానీ రోబో తర్వాత తన రూట్ మార్చారు. పాటలు ఆడియెన్స్ కు విజువల్ ట్రీట్ ను అందిస్తాయి. ఈ మూవీ కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అన్న నమ్మకం ఉంది” అంటూ ఈ వేడుకలో దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. దాంతో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అన్న ఆసక్తితో వారు ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)