iDreamPost
android-app
ios-app

సెలూన్ పేరుతో గలీజ్ పనులు..పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మహిళ!

సెలూన్ పేరుతో గలీజ్ పనులు..పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మహిళ!

ఈ యువతి పేరు గాయత్రి. చూడటానికి అమాయకంగా కనిపిస్తుంది కదా అని అస్సలు జాలి చూపించకండి. ఎందుకంటే.. ఆమె చేసిన పనులు అలాంటివి మరి. ఎందరో అమాయక యువతలను నమ్మించి గలీజ్ దందాకు తెర లేపింది. ఇన్నాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తూ.. పాడు పనులకు తెర లేపింది. కానీ, అసలు విషయం ఎట్టకేలకు బయటపడడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకు ఈ వీళ్లు చేసిన ఆ పాడు పని ఏంటి? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన గాయత్రి (23), రాజేష్ (47) ఇద్దరివీ వేరు వేరు ప్రాంతాలు. అయినా వీరికి కాస్త పరిచయం ఉండడంతో ఓ బిజినెస్ ను ప్రారంభించాలని అనుకున్నారు. జనాలకు ఉపయోగపడి, వాళ్లు బాగుపడేది అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, వాళ్లు మొదలు పెట్టిన బిజినెస్ ఏంటో తెలుసా.. వ్యభిచార దందా. అవును.. మీరు విన్నది నిజమే. సెలూన్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు మొదలు పెట్టి నిరుపేద అందమైన అమ్మాయిలను, మహిళలను బుట్టలో వేసుకున్నారు.

ఆ తర్వాత మెల్లగా వారిని నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపేవారు. అయితే ఇదే విషయం స్థానికులు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. అనుమానం రాకుండా ఆ సెలూన్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు యువతులను రక్షించిన పోలీసులు.. వ్యభిచార నిర్వాహకులైన గాయత్రి, రాజేష్ లను అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.