దారుణం: యువకుడితో పాదం నాకించుకున్న దుండగులు.. వైరల్ వీడియో!

దారుణం: యువకుడితో పాదం నాకించుకున్న దుండగులు.. వైరల్ వీడియో!

మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన వ్యక్తిపై ఓ పార్టీకి చెందిన నేత ఓ గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన మరువకముందే మధ్యప్రదేశ్ లో ఇలాంటిదే మరొకటి వెలుగు చూసింది. కొందరు దుండగులు ఓ యువకుడిని కారులో ఎక్కించుకుని అతనితో వారి పాదాలను నాకించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై రాష్ట్ర హొంమంత్రి స్పందించి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.

మధ్యప్రదేశ్ గ్వాలియార్ పరిధిలోని దుబ్రా ప్రాంతంలో కొందరు దుండగులు ఓ యువకుడిని కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ యువకుడిపై దాడి చేశారు. ఇంతే కాకుండా ఆ దండుగులు ఆ యువకుడితో పాదాన్ని నాకించుకున్నారు. ఇదంతా వెనకాల కారులో కూర్చున్న మరికొందరు వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇదే వీడియోపై ఆ రాష్ట్ర హోంమంత్రి సైతం స్పందించారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments