Swetha
క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం ఇష్టం అయితే మాత్రం ఈ సిరీస్ అసలు మిస్ చేయకుండ చూడాల్సిందే. ఈ సిరీస్ ఓటిటి లో ఇప్పుడు తెగ ట్రెండ్ అయిపోతుంది. సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్ ను కూడా రిలీజ్ చేసింది. దీనితో ఈ సిరీస్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.
క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం ఇష్టం అయితే మాత్రం ఈ సిరీస్ అసలు మిస్ చేయకుండ చూడాల్సిందే. ఈ సిరీస్ ఓటిటి లో ఇప్పుడు తెగ ట్రెండ్ అయిపోతుంది. సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్ ను కూడా రిలీజ్ చేసింది. దీనితో ఈ సిరీస్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.
Swetha
క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం ఇష్టం అయితే మాత్రం ఈ సిరీస్ అసలు మిస్ చేయకుండ చూడాల్సిందే. ఈ సిరీస్ ఓటిటి లో ఇప్పుడు తెగ ట్రెండ్ అయిపోతుంది. సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్ ను కూడా రిలీజ్ చేసింది. దీనితో ఈ సిరీస్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నాలుగో సీజన్ హత్య గురించి మాత్రమే కాకుండా.. ప్రేమ , నమ్మక ద్రోహం , చాలా సీక్రెట్స్ ఇలా చాలా లేయర్స్ ఉన్నాయి.
ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్న డాక్టర్ రాజ్ నాగ్పాల్, అంజు ఇప్పుడు విడివిడిగా ఉంటారు. కానీ చట్టపరంగా ఇంకా విడిపోలేదు. ఇద్దరు ఎదురెదురు ఫ్లాట్స్ లో ఉంటూ ఉంటారు. రాజ్ రోషిని అనే అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. అలా ఓ పార్టీ తర్వాత ఆమె చనిపోయి కనిపిస్తుంది. పైగా రోషిని ప్రెగ్నెంట్ అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఈమె హత్య చుట్టూ ఈ కేసు తిరుగుతూ ఉంటుంది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. అసలు ఆమెను ఎవరు హత్య చేశారు ? ఎందుకు చేశారు ? అనేది డీల్ చేయడానికి మరోసారి న్యాయవాది మాధవ్ మిశ్రా రంగంలోకి దిగుతాడు.
ఇలా ప్రతి ఎపిసోడ్లో కొత్త ట్విస్టులు, ఉత్కంఠగా సాగే అంశాలు ఉంటాయి. సత్యాన్ని నిరూపించేందుకు న్యాయవాది ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? అనేది ఈ సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్ ఏంటో అర్దమైపోయి ఉంటుంది. ఈ సిరీస్ పేరు క్రిమినల్ జస్టీస్ . ఈ సిరీస్ ప్రస్తుతం ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.